24 గంటల్లో ప్రతీకారం తీర్చుకున్నారు.. మమతా బెనర్జీపై మోడీ ఫైర్
కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ రేంజ్లో ఫైరయ్యారు. బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటానన్న 24 గంటల్లోనే దీదీ అన్నంత పని చేశారని చురకలు అంటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీపై దాడి జరగడం అందులో భాగమేనంటూ ఎద్దేవా చేశారు.
మమతా బెనర్జీకి సంబంధించి మార్ఫింగ్ చేసిన ఫోటోను బీజేపీ కార్యకర్త షేర్ చేస్తే జైలులో పెట్టడం తగదన్నారు. ఆడ కూతుళ్లను సతాయిస్తే రేపు మీకు శిక్ష ఖాయమంటూ వ్యాఖ్యానించారు. ఒక ఫోటోను మార్ఫింగ్ చేస్తే అంత స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం అవసరమా అంటూ ప్రశ్నించారు. అలాంటి విషయాలను తాను చాలా తేలికగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఎవరైనా తన ఫోటోను అలా మార్ఫింగ్ చేస్తే ఎట్టిపరిస్థితుల్లో కోపం తెచ్చుకోనని.. ఒక ప్రధానిగా హుందాగా వ్యవహరిస్తానని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే సీన్ ఉండబోదని హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా రెపరెపలాడుతుందని.. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీదే అధికారమన్నట్లుగా సర్వేలు కూడా అదే విషయం చెబుతున్నాయని చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను తిరస్కరించడం ఖాయమని జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ గెలవనున్న 300 స్థానాల్లో బెంగాల్ తోడ్పాటు కచ్చితంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications