బ్రటీష్ టీనేజర్ హత్య కేసులో వాళ్లు నిర్ధోషులు: గోవా కోర్టు సంచలనం
పనాజీ: 15ఏళ్ల బ్రటీష్ టీనేజర్ స్కార్లెట్ కీలింగ్ హత్య కేసులో గోవా కోర్టు శుక్రవారం తీర్పును వెలవరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరి యువకులను గోవాలోని చిల్డ్రన్స్ కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది. ఈ మేరకు గోవా చిల్డ్రన్స్ కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.
2008లో సరిగ్గా 15ఏళ్ల క్రితం బ్రిటిష్ టూరిస్ట్ స్కార్లెట్ను స్థానికులైన సామ్సన్ డిసౌజా, ప్లాసిడో కార్వలో ఇద్దరూ అత్యాచారం చేసి చంపేశారు. అనంతరం స్కార్లెట్ గోవాలోని అంజునా బీచ్లో శవమై తేలింది. ఈ కేసులో సామ్సన్ డిసౌజా, ప్లాసిడో కార్వలోను అరెస్టు చేశారు.
గోవా కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల స్కార్లెట్ తల్లి ఫియోనా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. వాస్తవానికి స్కార్లెట్ మరణం సహజమైందని అప్పట్లో పోలీసులు నిర్ధారించారు. అయితే రెండోసారి ఈ అత్యాచారం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ జాతీయుడు, ప్రత్యక్ష సాక్షి కీలకంగా మారడంతో ఆ తర్వాత దానిని మర్డర్ కేసుగా నమోదు చేశారు.
2008 Scarlett Keeling murder case: I don't have faith in the justice system here to give us justice, anymore: Scarlett Keeling's mother pic.twitter.com/TxxToyYjkz
— ANI (@ANI_news) September 23, 2016
I had some hope in CBI but it is clear that either they are incompetent or corrupt & I believe they are not incompetent: Keeling's mother
— ANI (@ANI_news) September 23, 2016