మిత్రులతో కలిసి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
నాగపూర్: పాఠశాల విద్యార్థినిని తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేసిస దారుణ సంఘటన మహారాష్ర్టలో జరిగింది. నాగపూర్ లోని పాఠశాలలో ఓ విద్యార్థిని వథోడాలో నివాసం ఉంటున్నది. ఈ బాలికకు పరిచయం ఉన్న ఓ యువకుడు ఆమెను నమ్మించి మాయమాటల్లో దింపాడు.
తరువాత బాలికను నమ్మించి తీసుకు వెళ్లాడు. అనంతరం తన నలుగురి స్నేహితులతో కలిసి బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరిక్షలకు తరలించారు. విద్యార్థిని మీద అత్యాచారం చేసిన వారిలో రాహుల్ నాందేవ్ (19) అనే యువకుడితో పాటు నలుగురు మైనర్లు ఉన్నారని పోలీసు అధికారులు చెప్పారు. నిందితులను అరెస్టు చేశామని, మైనర్లని జువైనల్ జైలుకు తరలించామని పోలీసు అధికారులు తెలిపారు.