యువతిపై రెండుసార్లు గ్యాంగ్రేప్: వీడియో తీసి బెదిరింపు
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ 16ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని రెండురోజులపాటు కొనసాగించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహామాయాపూర్ ప్రాంతానికి చెందిన బాధిత బాలిక 8వ తరగతి చదువుతోంది.
ఆమెను జనవరి 27న అపహరించిన ముగ్గురు దుండగులు, ఆమెపై అదేరోజు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాతి రోజు కూడా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక, ఈ అఘాయిత్యాన్ని సెల్ఫోన్లో వీడియో తీశారు. ఎవరికైనా చెబితే వీడియోను బహిర్గతం చేస్తామని బెదరింపులకు గురిచేశారు.
కాగా, ఇంటికి చేరుకున్న యువతి, కుటుంబసభ్యులకు జరిగిన విషయాన్ని తెలిపింది. బాధితురాలితో కలిసి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నిందితులలో ఇద్దర్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మూడో నిందితుడి కోసం గాలింప చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పారు.