సెకండ్ వేవ్ మరింత ప్రమాదం.. జాగ్రత్తలు తప్పనిసరి... కరోనా గురించి నిపుణుల వార్నింగ్
కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. తొలి విడత కన్నా రెండో విడత ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలని పదే పదే సూచిస్తున్నారు. కరోనా రీ ప్రొడక్షన్ రేట్ 19 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని వివరించారు. రీ ప్రొడక్షన్ రేట్ జాతీయ స్థాయిలో 1.65 ఉండగా.. కర్ణాటకలో 1.66 ఉందని డాక్టర్ గిరిధర్ బాబు తెలిపారు. ఒకరికి వైరస్ సోకితే అదీ మిగతా వారికి సోకుతుందని తెలిపారు.
మార్చి 7వ తేదీన కర్ణాటకలో 1.23 శాతం ఉండగా.. మరింత పెరిగింది. యూకే మాదిరిగా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ పంజాబ్ చేరిందని చెప్పారు. అదీ ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తుందని వివరించారు. బెంగళూర్లో రీ ప్రొడక్షన్ 1.36 శాతం ఉండగా.. 43.7 శాతం ఉందని తెలిపారు. వైరస్ వేగంగా వ్యాపిస్తోందని వివరించారు.
కరోనా ఈ స్థాయిలో ప్రభావం చూపుతోన్న.. దానికి లాక్ డౌన్ పరిష్కారం కాదని అంటున్నారు. మాస్క్ విధిగా ధరించాలని సూచిస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు. కరోనాకు ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, నొవావ్యాక్స్, స్పుత్పిక్ వీ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.