రూ. 130 కోట్లు, 171 కేజీల బంగారం సీజ్: శేఖర్ రెడ్డికి నో బెయిల్
ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించి తమిళనాడుతో సహ దేశం మొత్తం సంచలనం రేపిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డికి సీబీఐ కోర్టులో మళ్లీ చుక్కెదురైయ్యింది.
చెన్నై: ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించి తమిళనాడుతో సహ దేశం మొత్తం సంచలనం రేపిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డికి సీబీఐ కోర్టులో మళ్లీ చుక్కెదురైయ్యింది. ఆయనకు బెయిల్ ఇవ్వలేమని సీబీఐ కోర్టు చెప్పింది.
నేడు ఆఖరు రోజు: శశికళ పదవి ఊడిపోతే పళనిసామి ఇంటికే !
శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో క్షుణ్ణంగా పరిశీలించి రూ. 130 కోట్ల నగదు, 171 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదులో పెద్దనోట్లు రద్దు చేసిన తరువాత చలామణిలోకి వచ్చిన రూ. 34 కోట్లు (రూ. 2,000) గుర్తించారు.
శశికళకు ఝలక్: డీఎంకేతో చేతులు కలిపిన సీనియర్ నటుడు
డిసెంబర్ 21వ తేదిన సీబీఐ అధికారులు శేఖర్ రెడ్డి, ఆయన అనుచరులను అరెస్టు చేశారు. 2017 జనవరి 3వ తేదీ వరకు కస్టడీలోకి తీసుకుని విచారించారు. తరువాత శేఖర్ రెడ్డిని రిమాండ్ కు తరలించారు. అప్పటి నుంచి శేఖర్ రెడ్డి ఆయన అనుచరులు బెయిల్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మంగళవారం చెన్నైలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో శేఖర్ రెడ్డి తదితరులకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.