‘ఆ విషయాన్ని ముస్లింలకు మోడీయే చెప్పాలి’
ముంబై: ముస్లింలకు ధీటుగా నిలిచేందుకు హిందూ జనాభాను పెంచుకుంటూ పోవడం సమస్యకు పరిష్కారం కాదని శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. ఈ విషయంలో ‘సంఘ్' చొరవ తీసుకోవాలని, కుటుంబ నియంత్రణ అన్ని మతాలకు ఖచ్చితంగా వర్తింపజేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించింది.
దేశంలో అతిపెద్ద మైనార్టీ కమ్యూనిటీ అయిన ముస్లిం జనాభా నానాటికీ పెరుగుతున్న కారణంగా దేశంలో భాషా సంబంధ, బౌగోళిక పరమైన అసమతుల్యత ఏర్పడుతుందని హెచ్చరించింది. తద్వారా దేశ సమైక్యతకు బీటలువారే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
అందుకే, కుటుంబ నియంత్రణ పాటించాలని ముస్లింలకు ప్రధాని నరేంద్ర మోడీయే సూటిగా చెప్పాలని శివసేన సూచించింది.

‘దేశ చట్టాన్ని గౌరవించాలని, కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యతను గుర్తించాలని ఆయన ముస్లింలకు వివరించాలి. ముస్లింలు అర్ధరాత్రి వచ్చి తన ఇంటి తలుపు తట్టినా వారి సమస్యలను పరిష్కరిస్తాను అని ప్రధాని హామీ ఇచ్చారు. ఇదే రీతిలో ముస్లింలు కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన అవసరం లేదా?' అని శివసేన తన అధికారపత్రిక సామ్నాలో పేర్కొంది.
దేశంలో లోక్పాల్ కంటే కామన్ సివిల్ కోడ్ అవసరమని శివసేన అభిప్రాయపడింది. ‘ఘర్ వాపసీ కార్యక్రమాలు నిర్వహించే వారు నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చు. మేం అందుకు అభ్యంతరం చెప్పబోము. అయితే, ఇస్లామిక్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఇది పరిష్కారం కాదు' అని శివసేన పేర్కొంది.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications