సెల్ టవర్స్పై దాడులు చేస్తున్న మిలిటెంట్స్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రజలు సైనికులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ ఫోన్ టవర్లు ధ్వంసం చేస్తున్నారు. శుక్రవారం మళ్లీ కమ్యూనికేషన్ సంస్థల మీద దాడులు చేశారు.
శుక్రవారం శ్రీనగర్ లోని వొడాఫోన్ టవర్ల మీద గ్రెనేడ్ లతో దాడులు చేశారు. టవర్లు పూర్తిగా ధ్వంసం చెయ్యడానికి ప్రయత్నించారు. అదే విధంగా ఎయిర్ సెల్ షో రూంను పూర్తిగా ధ్వసం చేశారు. టెలికాం సంస్థలను మిలిటెంట్లు టార్గెట్ చేసుకున్నారు.

టెలికాం సంస్థలపై దాడులు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను స్థంభింప చెయ్యాలని మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు. గతంలో అనేక సార్లు టెలికాం సంస్థల మీద దాడులు జరిగాయి. లష్కర్ ఏ తోయిబా మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు.
సుమారు 50 టవర్లు నేలమట్టం చేశారు. కాశ్మీర్ లోయలో ఉంటున్న ప్రజలు ప్రతి నిత్యం సైనికులకు సహకరిస్తు తమ కార్యకలాపాలు అడ్డుకుంటున్నారని మిలిటెంట్లు భావిస్తున్నారు. అందువలనే కమ్యూనికేషన్ సంస్థల మీద దాడులు చేస్తున్నారని అధికారులు అంటున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications