వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెల్ టవర్స్‌పై దాడులు చేస్తున్న మిలిటెంట్స్

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రజలు సైనికులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ ఫోన్ టవర్లు ధ్వంసం చేస్తున్నారు. శుక్రవారం మళ్లీ కమ్యూనికేషన్ సంస్థల మీద దాడులు చేశారు.

శుక్రవారం శ్రీనగర్ లోని వొడాఫోన్ టవర్ల మీద గ్రెనేడ్ లతో దాడులు చేశారు. టవర్లు పూర్తిగా ధ్వంసం చెయ్యడానికి ప్రయత్నించారు. అదే విధంగా ఎయిర్ సెల్ షో రూంను పూర్తిగా ధ్వసం చేశారు. టెలికాం సంస్థలను మిలిటెంట్లు టార్గెట్ చేసుకున్నారు.

Separatist Militants on friday attacked a cell phone towers

టెలికాం సంస్థలపై దాడులు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను స్థంభింప చెయ్యాలని మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు. గతంలో అనేక సార్లు టెలికాం సంస్థల మీద దాడులు జరిగాయి. లష్కర్ ఏ తోయిబా మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు.

సుమారు 50 టవర్లు నేలమట్టం చేశారు. కాశ్మీర్ లోయలో ఉంటున్న ప్రజలు ప్రతి నిత్యం సైనికులకు సహకరిస్తు తమ కార్యకలాపాలు అడ్డుకుంటున్నారని మిలిటెంట్లు భావిస్తున్నారు. అందువలనే కమ్యూనికేషన్ సంస్థల మీద దాడులు చేస్తున్నారని అధికారులు అంటున్నారు.

English summary
Separatist guerrillas on friday attacked a cell phone towers here with a hand grenade, injuring one person, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X