National Heralad Case : కాంగ్రెస్ కు భారీ షాక్- రూ.751.9 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆర్ధిక అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందిన రూ.751.9 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది. గతంలో ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని సైతం పిలిపించి విచారించిన ఈడీ.. కొంతకాలంగా మౌనంగా ఉంటోంది. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తుల జప్తు సంచలనం రేపుతోంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి 2014లో కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి ఈడీ అప్పట నుంచి దీన్ని దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి కాంగ్రెస్కు చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియన్ సంస్ధలపై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను ఇవాళ జప్తు చేసింది.

యంగ్ ఇండియా సంస్ధతో సహా ఏడుగురు నిందితులు నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, మోసం, నిజాయితీ లేని ఆస్తుల దుర్వినియోగం, నేరపూరిత కుట్ర వంటి నేరాలకు పాల్పడ్డారని ఢిల్లీ కోర్టు గతంలో నిర్ధారించింది. యంగ్ ఇండియన్ ద్వారా ఏజేఎల్కు చెందిన వందల కోట్ల ఆస్తులు సంపాదించేందుకు కుట్ర జరిగినట్లు తేలింది. వార్తాపత్రికలను ప్రచురించడానికి రాయితీ ధరలకు భూమిని పొందిన ఏజేఎల్ సంస్ధ..2008లో తన కార్యకలాపాలను నిలిపేసింది. ఆ తర్వాత వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ ఆస్తులను వాడుకుంది.
దీంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి ఏజేఎల్ సంస్ధ రూ.90 కోట్ల అప్పు చెల్లించాల్సి వచ్చింది. కానీ ఈ అప్పు చెల్లించలేని పరిస్దితిలో ఏజేఎల్ ఉందని చూపించి కాంగ్రెస్ పార్టీ దీన్ని మరో కొత్త సంస్ధ యంగ్ ఇండియాలో విలీనం చేసింది. ఇందుకు గాను 50 లక్షలు చెల్లించింది. దీంతో ఏజేఎల్ వాటాదారుల్ని కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు మోసం చేశారని కోర్టు నిర్ధారించింది. కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్ ను యంగ్ ఇండియాకు ఇచ్చేశాక పాత రుణం చెల్లించాలని, లేదా ఏజేఎల్ షేర్లు కేటాయించాలని కోరింది.
దీంతో ఏజేఎల్ సంస్ధ ఓ అత్యవసర సమావేశం నిర్వహించి వాటా మూలధనం పెంపుతో పాటు యంగ్ ఇండియాకు తాజాగా రూ.90.21 కోట్ల విలువైన షేర్ల జారీకి తీర్మానం చేసింది. ఈ తాజా షేర్ల కేటాయింపుతో వెయ్యి కంటే ఎక్కువ మంది వాటాదారుల వాటా కేవలం 1 శాతానికి తగ్గించారు. అలాగే ఏజేఎల్ కూడా యంగ్ ఇండియా అనుబంధ సంస్థగా మారింది. అలాగే యంగ్ ఇండియా ఏజేఎల్ ఆస్తులపై నియంత్రణ కూడా తెచ్చుకుంది. ఇందులో అక్రమాలు జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications