ఇంటికి నిప్పంటించిన భార్య: భర్తతో సహా ఏడుగురు సజీవ దహనం
చెన్నై: తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. భర్త తనన్ని చాలా కాలంగా కాపురానికి పిలవడం లేదనే కోపంతో ఆ ఇంటి కోడలే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం భార్యభర్తలైన కన్నన్ (27), పాందీశ్వరి (25) మధ్య మనస్పర్ధలు రావడంతో గత కొంతకాలంగా వేరువేరుగా ఉంటున్నారు. భర్త అదే గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండగా, పాందీశ్వరి వేరే ఇంట్లో ఉంటోంది.

తన భర్త, అతని కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రస్తున్న సమయంలో బయట నుంచి గడి పెట్టిన పాందీశ్వరి ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది.
దీంతో భర్త, అత్తమామలతో పాటు ఏడుగురు సజీవ దహనమయ్యారు. అందరూ నిద్రలోనే తమ తుది శ్వాసను విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
గతంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో, ఎందుకు ఆమె ఇంతటి దారుణానికి ఒడిగట్టిందోననే కోణంలో పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications