బుఖారీ వారసుడిగా షాబాన్, ఢిల్లీ హైకోర్టుకు(ఫోటోలు)
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జామా మసీదు 14వ షాహీ ఇమాంగా... సయ్యద్ అహ్మద్ బుఖారీ తనయుడు షాబాన్ బుఖారీని శనివారం నియమించారు. ప్రపంచం నలు మూలల నుంచి వచ్చిన ముస్లిం పెద్దల సమక్షంలో మసీదు ప్రాంగణంలో ఈ వేడుక నిర్వహించారు.
ఆ తర్వాత ముస్లిం మత పెద్దలు దానిని తాకి, తమ ఆమోదాన్ని తెలిపారు. సయ్యద్ బుఖారీ మాట్లాడుతూ వారసుడి విషయంలో 400 ఏళ్లుగా తమ కుటుంబాల్లో ఉన్న సంప్రదాయాన్నే తాను కొనసాగిస్తున్నానని చెప్పారు.
ఢిల్లీలోని జామా మసీదు దేశంలోనే అతిపెద్దది. షాబాన్ బుఖారీ వయసు 19 సంవత్సరాలు. షాబాన్ డిగ్రీ చదువుతున్నారు. సయ్యద్ అహ్మద్ బుఖారీ 2000 సంవత్సరం నుంచి ఆ పదవిలో ఉన్నారు.
17వ శతాబ్దంలో మొఘలల కాలంలో నిర్మితమైన జామా మసీదుకు ఇమామ్లుగా బుఖారీ కుటుంబమే నిర్వహిస్తోంది. తొలి షాహీ ఇమాంగా అబ్దుల్ గఫూర్ షా బుఖారీని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1656లో నియమించారు.
14వ షాహీ ఇమాంగా బుఖారీ తనయుడు షాబాన్
ప్రతిష్టాత్మక జామా మసీదు 14వ షాహీ ఇమాంగా... సయ్యద్ అహ్మద్ బుఖారీ తనయుడు షాబాన్ బుఖారీని శనివారం నియమించారు. ప్రపంచం నలు మూలల నుంచి వచ్చిన ముస్లిం పెద్దల సమక్షంలో మసీదు ప్రాంగణంలో ఈ వేడుక నిర్వహించారు.
14వ షాహీ ఇమాంగా బుఖారీ తనయుడు షాబాన్
ఆ తర్వాత ముస్లిం మత పెద్దలు దానిని తాకి, తమ ఆమోదాన్ని తెలిపారు. సయ్యద్ బుఖారీ మాట్లాడుతూ వారసుడి విషయంలో 400 ఏళ్లుగా తమ కుటుంబాల్లో ఉన్న సంప్రదాయాన్నే తాను కొనసాగిస్తున్నానని చెప్పారు.
14వ షాహీ ఇమాంగా బుఖారీ తనయుడు షాబాన్
ఢిల్లీలోని జామా మసీదు దేశంలోనే అతిపెద్దది. షాబాన్ బుఖారీ వయసు 19 సంవత్సరాలు. షాబాన్ డిగ్రీ చదువుతున్నారు. సయ్యద్ అహ్మద్ బుఖారీ 2000 సంవత్సరం నుంచి ఆ పదవిలో ఉన్నారు.
14వ షాహీ ఇమాంగా బుఖారీ తనయుడు షాబాన్
17వ శతాబ్దంలో మొఘలల కాలంలో నిర్మితమైన జామా మసీదుకు ఇమామ్లుగా బుఖారీ కుటుంబమే నిర్వహిస్తోంది. తొలి షాహీ ఇమాంగా అబ్దుల్ గఫూర్ షా బుఖారీని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1656లో నియమించారు.
14వ షాహీ ఇమాంగా బుఖారీ తనయుడు షాబాన్
మరోవైపు జామా మసీదు షాహీ ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ తన కొడుకుని వారసుడిగా ప్రకటించడంపై కేంద్రం, వక్ఫ్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తదుపరి షాహీ ఇమాంగా కుమారుడికి శనివారం పట్టం గట్టనుండటం చట్టరీత్యా చెల్లదని ఢిల్లీ హైకోర్టుకు తెలిపాయి.
జామా మసీదులో 1656లో తొలి నమాజు చేశారు. నఈబ్ ఇమామ్ నియామకం సందర్భంగా రాబోయే వారంలో బుఖారీల కుటుంబం ఇచ్చే విందుకు ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరుకానున్నాట్లు పేర్కొన్నారు.
మరోవైపు జామా మసీదు షాహీ ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ తన కొడుకుని వారసుడిగా ప్రకటించడంపై కేంద్రం, వక్ఫ్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తదుపరి షాహీ ఇమాంగా కుమారుడికి ప్రకటించడం చట్టరీత్యా చెల్లదని ఢిల్లీ హైకోర్టుకు తెలిపాయి.