కంచి 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతి?
చెన్నై :జయేంద్ర సరస్వతి శివక్యైం పొందడంతో కంచి కామకోటి మఠం 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతికి పట్టాభిషేకం చేసే అవకాశాలున్నాయి. ఈయన అసలు పేరు శంకరనారాయణన్.
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బుధవారం నాడు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.దీంతో శంకర విజయేంద్ర సరస్వతికి పట్టాభిషేకం చేసే అవకాశాలున్నాయని సమాచారం.
జయేంద్ర సరస్వతి అకాల మరణం శిష్య బృందాన్ని విషాదంలో నింపింది. అయితే భవిష్యత్తులో కంచి పీఠాన్ని నడిపేందుకు జయేంద్ర సరస్వతి స్థానంలో శంకర విజయేంద్ర సరస్వతిని నియమించే అవకాశాలున్నాయని సమాచారం సాగుతోంది.
శంకర విజయేంద్ర సరస్వతి 1969 మార్చి 18న జన్మించారు. తిరువళ్లూరు జిల్లా ఆరణి సమీపంలోని పెరియపాళయం ఆయన స్వస్థలం. 1983 మే 29న పోలూరులో ఆధ్యాత్మిక గురువయ్యారు. జయేంద్ర సరస్వతితో కలసి అడుగులు వేశారు. వివాదాల్లోనూ, కారాగారవాసంలోనూ తోడుగానే నిలబడ్డారు. మేఘాలయ వరకు పర్యటించి ఆధ్యాతిక బోధనలు చేశారు.