Sharad Pawar.. సంచలనం: కన్నీరు పెట్టిన కార్యకర్తలు: వేదికపైనే చుట్టుముట్టారు
ముంబై: దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్, కేంద్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్సీపీ అధినేత పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ పదవి నుంచి వైదొలగినట్లు వెల్లడించారు. ఆయన ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే మహారాష్ట్ర మాజీ మంత్రులు, ఎన్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ పట్టుబట్టారు. శరద్ పవార్ను వేదికపైనే చుట్టుముట్టారు. సీనియర్ నేత ధనంజయ్ ముండే కన్నీరు మున్నీరయ్యారు. అనూహ్యంగా తలెత్తిన ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. శరద్ పవార్ తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే పెద్ద ఎత్తున ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు వేదిక మీదికి తరలిరావడంతో గందరగోళం నెలకొంది. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ముంబైలో ఏర్పాటైన ఓ కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లోక్ మాఝే సంగత్ పేరుతో గతంలో ఆయన తన రాజకీయ ఆత్మకథతో పుస్తకాన్ని రాశారు. దీన్ని రివైజ్డ్ వర్షన్ను ఆవిష్కరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఇందులో ఆయన కీలక ప్రసంగం చేశారు. భావోద్వేగంతో ప్రసంగించారు. రాజకీయ జీవితానికి పుల్స్టాప్ పెట్టాల్సిన తరుణం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.
ఈ దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని శరద్ పవార్ పేర్కొన్నారు. దశాబ్దాల పాటు తాను దేశ రాజకీయాల్లో కొనసాగుతూ వస్తోన్నానని, ఎన్నో పదవులను అధిష్ఠించానని గుర్తు చేశారు. పార్టీ ప్రస్థానం గురించీ ప్రస్తావించారాయన. 1999లో ఎన్సీపీ ఆవిర్భవించిందని, అప్పటి నుంచీ 24 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా పనిచేస్తోన్నానని శరద్ పవార్ చెప్పుకొచ్చారు.
#WATCH | Supporters of NCP chief Sharad Pawar protest against his announcement to step down as the national president of NCP. pic.twitter.com/LsCV601EYs
— ANI (@ANI) May 2, 2023
ఇక తన రాజకీయ జీవితం ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిన అవసరం వచ్చిందని, అందుకే ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని శరద్ పవార్ స్పష్టం చేశారు. 1960 మే 1వ తేదీ నుంచి 2023 మే 1వ తేదీ వరకు ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నానని, తన రాజకీయ ప్రయాణం ఎక్కడో ఒకచోట ఆగిపోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందుకే ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
విద్య, వ్యవసాయం, సహకార రంగం, క్రీడలు, సాంస్కృతిక రంగాలలో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని తాను భావిస్తోన్నానని శరద్ పవర్ వివరించారు. అలాగే- యువత, మహిళలు, విద్యార్థుల, కార్మికులు, దళితులు, గిరిజనులు, సమాజంలోని ఇతర బలహీన వర్గాల సమస్యలపై తాను దృష్టి సారిస్తానని, వారికోసం నిరంతరాయంగా పోరాడుతాననీ శరద్ పవార్ తేల్చి చెప్పారు.
#WATCH | NCP leader Jayant Patil breaks down after party chief Sharad Pawar announces that he will step down as party president. pic.twitter.com/nDCu9iX2OG
— ANI (@ANI) May 2, 2023
రాజ్యసభ సభ్యుడిగా తన సభ్యత్వం ఇంకా ముగియలేదని, మూడు సంవత్సరాల కాలం మిగిలే ఉందని అన్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో తాను రాష్ట్ర, జాతీయ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. దానికి మించి మరే ఇతర బాధ్యతలను కూడా తీసుకోవడానికి తాను సిద్ధంగా లేనని శరద్ పవార్ అన్నారు. ఆయన ఈ ప్రకటన చేసిన వెంటనే ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications