కూతురుకి పరీక్షలు: సోనియాపై ఎఎపి నేత షాజియా నో
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సీనియర్ నేత షాజియా ఇల్మి రాయ్ బరేలి నుండి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. తన కూతురుకు పరీక్షలు ఉన్నందున.. తాను దేశ రాజధాని ఢిల్లీ నుండి పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆమె చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
షాజియా ఇల్మిని రాయ్ బరేలీ నుండి పోటీ చేయాలని ఎఎపి అధిష్టానం మొదటి నుండి కోరుతోంది. రాయ్ బరేలీ నుండి ప్రస్తుతం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సోనియా పైన ఎఎపి తరఫున షాజియా ఇల్మి పోటీ చేయనున్నారనే ప్రచారం జరిగింది.

అయితే, షాజియా ఇల్మి మాత్రం రాయ్ బరేలీ నుండి పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు. తాను రాయ్ బరేలీ నుండి పోటీ చేస్తానన్న వార్తలను ఇల్మి ఖండించారు. తాను డిల్లీలోనే ఏదో ఒక లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఢిల్లీలో పోటీ చేసేందుకు ఆమె తన కూతురు పరీక్షలను కారణంగా చూపిస్తున్నారట.
కాగా, తాను రాయ్ బరేలీ నుండి పోటీ చేయడం లేదని, తాను అక్కడి నుండి పోటీ చేసేందుకు పార్టీ చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు అంగీకరించలేదని, గత రెండు నెలలుగా తాను అక్కడి నుండి టిక్కెట్ వద్దని చెబుతున్నానని ట్విట్టర్లో స్పందించారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications