షీనా బోరా హత్య కేసు: ఆరేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ, ‘జైల్లో బ్యూటీపార్లర్’
న్యూఢిల్లీ: మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జీ(ఇంద్రాణి ముఖర్జియా) తన కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో అరెస్టయిన దాదాపు ఏడేళ్ల తర్వాత శుక్రవారం బైకుల్లా జైలు నుంచి బయటకు వచ్చారు. ముంబై సీబీఐ కోర్టు నిర్దేశించిన ప్రకారం రూ. 2 లక్షల పూచీకత్తును సమర్పించిన తర్వాత ముఖర్జీ జైలు నుంచి బయటకు వచ్చారు.
బుధవారం సుప్రీంకోర్టు ముఖర్జీకి బెయిల్ మంజూరు చేసింది. "నేను చాలా సంతోషంగా ఉన్నాను," అని ముఖర్జీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో అన్నారు. 'నేను ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను.. సానుభూతి, క్షమాపణ.. నన్ను బాధపెట్టిన వారందరినీ నేను క్షమించాను. నేను జైలులో చాలా నేర్చుకున్నాను' అని ఇంద్రాణి కారులో వెళ్లిపోయారు.

పీటీఐ కథనం ప్రకారం.. స్పోర్టింగ్ జెట్ బ్లాక్ హెయిర్తో ముఖర్జీ శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చి కారులో బయలుదేరడం కనిపించింది. బైకుల్లా జైలు వెలుపల ఆమెను తీసుకెళ్లేందుకు ఆమె తరపు న్యాయవాది హాజరయ్యారు.
శుక్రవారం జైలు నుంచి బయటకు వచ్చిన ఇంద్రాణి మీడియా ప్రతినిధులను చూసి చిరునవ్వు నవ్వారు. ఆమె మారిన రూపాన్ని చూసి సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. 'అంటే వారికి జైల్లో బ్యూటీ పార్లర్లు ఉన్నాయి' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అంతకుముందు విడుదలైన ఫొటోల్లో ఆమె నెరిసిన జుట్టుతో కనిపించడం గమనార్హం.
2 లక్షల తాత్కాలిక నగదు బాండ్ సమర్పించాలని గురువారం ట్రయల్ కోర్టు ఆమెను ఆదేశించింది. సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి, ఆ ఉత్తర్వులో.. ముఖర్జీ తప్పనిసరిగా తన పాస్పోర్ట్ను ప్రత్యేక కోర్టు ముందు అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా భారతదేశం వదిలి వెళ్ళకూడదని స్పష్టం చేశారు.
ఈ కేసులో సాక్షులెవరినీ సంప్రదించవద్దని, సాక్ష్యాలను తారుమారు చేయవద్దని ఇంద్రాణిని కోర్టు ఆదేశించింది. ఆమె తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని, ఎలాంటి వాయిదాలు కోరకూడదని కోర్టు తేల్చి చెప్పింది.
'పై షరతులను ఉల్లంఘించినట్లయితే, బెయిల్ రద్దుకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రాసిక్యూషన్కు స్వేచ్ఛ ఉంటుంది' అని న్యాయమూర్తి వీసీ బార్డే తన ఉత్తర్వులో పేర్కొన్నట్లు పీటీఐ వెల్లడించింది.
Mumbai | "I am just going home...Empathy and forgiveness...I have forgiven all the people who have hurt me. I have learned a lot in the jail," said Indrani Mukherjea after leaving from Byculla Jail earlier this evening. pic.twitter.com/NK7g8rjMNX
— ANI (@ANI) May 20, 2022
'నిందితురాలు తాత్కాలికంగా నగదు బెయిల్ను అందించడానికి సిద్ధంగా ఉంది. నగదు బెయిల్ బాండ్ను అందించిన తర్వాత ఆమెను బెయిల్పై విడుదల చేయవచ్చు' అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా, ఇంద్రాణి ముఖర్జీ తన కుమార్తె షీనా బోరా (24)ని ఏప్రిల్ 2012లో అప్పటి డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా సహాయంతో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications