ఇంద్రాణిని పోలీసులు కొడుతున్నారు: లాయర్లు
ముంబై: షీనా బొరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖార్జియాను పోలీసులు కస్టడీలో కొడుతున్నారని ఆమె తరఫు న్యాయవాదులు ఆరోపించారు. ఆమె పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆరోపించారు.
ఆ విషయంపై న్యాయవాదులు పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు ఫిర్యాదు చేసినట్లు ఓ టీవీ చానెల్లో వార్త వచ్చింది. నేరాన్ని ఒప్పుకోవాలని ఆమెపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపించారు.
కాగా, సంజీవ్ ఖన్నా కూతురు విధీ ముంబై కోర్టుకు వచ్చారు. షీలా హత్య కేసులో పోలీసులు ఇంద్రాణితో పాటు ఆమె డ్రైవర్ శ్యామ్ రాయ్, సంజీవ్ ఖన్నాలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, తనను మూడు సార్లు చంపడానికి ఇంద్రాణి ప్రయత్నించినట్లు మిఖాయిల్ బొరా ఆరోపించారు.

2012 ఏప్రిల్ 24వ తేదీన సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి షీనాను కలవడానికి ముందు తనకు మత్తు మందు ఇచ్చారని, అయితే తాను తప్పించుకున్నానని ఆయన అంటున్నారు. ముంబైలోని వొర్లి ఏరియాలో ఇంద్రాణి, పీటర్ ముఖార్జియా నివాసంలో పోలీసులు ఓ సూట్ కేసును స్వాధీనం చేసుకున్నారు. తనను చంపాలనే కుట్ర చేశారనే మిఖాయిల్ ఆరోపణకు అది బలం చేకూరుస్తోందని అంటున్నారు.
షీనాను చంపిన అటవీ ప్రాంతానికి పోలీసులు ఆదివారంనాడు సంజీవ్, ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ రాయ్ను తీసుకుని వెళ్లి హత్య జరిగిన తీరును పరిశోధించారు. శనివారంనాడు పోలీసు విచారణలో సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి పరస్పరం హత్యకు సంబంధించి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications