షీనా హత్య: పీటర్, ఇంద్రాణి రూ.275 కోట్ల మళ్లింపు?
న్యూఢిల్లీ: ముంబైలో సంచలనం సృష్టించిన షీనా బొరా హత్య కేసు మరో అనూహ్యమైన మలుపు తిరిగింది. షీనా బొరా తల్లి ఇంద్రాణి ముఖార్జియా, పీటర్ ముఖార్జియా రూ.275 కోట్ల మేరకు తమ కంపెనీ ఐఎన్ఎక్స్ మీడియా ద్వారా మళ్లించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) నివేదిక తెలిపింది.
హిందూలో ప్రచురితమైన ఆ నివేదిక ప్రకారం - మార్షియస్లోని పోర్ట్ లూయిస్లో గల బాటుకపు కంపెనీల ద్వారా ఐఎన్ఎక్స్ మీడియాలోకి ఇరువురు పెట్టుబడులు మళ్లించినట్లు ఆ నివేదిక తెలిపింది. ఎనిమిది అనుబంధ కంపెనీల ద్వారా 2007, 2008 మధ్య కాలంలో మనీ లాండరింగ్ జరిగింది.

సిడిబిటి దర్యాప్తు విభాగంలోని కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఆదాయం పన్నుల డైరెక్టర్ జనరల్కు నిరుడు మే 5వ తేదీన నివేదికను సమర్పించారు. 2008-09లో ఐఎన్ఎక్స్ మీడియా రూ.270 కోట్ల నష్టం వచ్చిందని ప్రకటించడం గమనార్హం.
న్యూ వెర్నానా ప్రైవేట్ ఈక్విటీ లిమిటెడ్ ద్వారా రూ.28.37 కోట్లు, న్యూ సిల్క్ రూట్ ద్వారా రూ.89.85 కోట్లు, డన ఎర్న్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా రూ.89.40 కోట్ల లావాదేవీలు జరిపారు. షీనా బొరా హత్య కేసులో ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖార్జియాను కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications