కావేరీ వివాదం: బోర్డు ఏర్పాటు ఆలస్యంపై సుప్రీం సీరియస్, అలా అయితే కోర్టు ధిక్కారమే
న్యూఢిల్లీ: కావేరీ జలాల వివాదంపై తాము ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది ఈ విషయమై మే 14వ తేదిన వ్యక్తిగతంగా హజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ వ్యక్తిగతంగా హజరుకాకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తోందని హెచ్చరించింది.
కావేరీ జలాల పంపిణీ కోసం బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ విషయమై ఇంతవరకు బోర్డును ఏర్పాటు చేయలేదు. బోర్డు ఏర్పాటు చేయకుండా కేంద్రం మీనమేషాలు లెక్కించడంపై కేంద్రం తీరును నిరసిస్తూ తమిళనాడులోని అన్ని పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి.

అయితే కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బోర్డు ఏర్పాటు చేస్తే రాజకీయంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున బోర్డు ఏర్పాటులో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోందని తమిళనాడుకు చెందిన పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
కావేరీ బోర్డు ఏర్పాటు ఉదంతంపై మంగళవారం నాడు సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. బోర్డు ఏర్పాటు చేయాలని ఫిబ్రవరిలో తీర్పు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. బోర్డు ఏర్పాటు కోసం నియమ నిబంధనలను ఎందుకు రూపొందించలేదని ప్రశ్నించింది.
మే 14వ తేదిన వ్యక్తిగతంగా హజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా హజరుకాకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తోందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications