హస్తినలో నీరు, కరెంట్ కష్టాలు .. సమస్య తీర్చాలని కేజ్రీతో షీలా డిమాండ్
న్యూఢిల్లీ : భానుడి భగ భగలు ఇంకా తగ్గలేదు. దీంతో కొన్నిప్రాంతాల్లో నీటి కొరత మరింత ఎక్కువైంది. ఇక రాజధాని నగరం ఢిల్లీలో నీటితోపాటు కరెంట్ కష్టాలు కూడా ఉన్నాయి. విద్యుత్ సరఫరా చేస్తున్నారు .. కానీ ... చార్జీలు పెంచడంతో హస్తనగరి వామ్మో అంటున్నాడు. ఈ నేపథ్యంలో చార్జీల పెంపుపై పునరాలోచించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దృష్టికి తీసుకొచ్చారు మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్.
నీటి కట కట
ఢిల్లీలో మంచినీటి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. నీటి కటకట కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆరాతీశారు షీలా దీక్షిత్. ఇవాళ ఢిల్లీలో కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధాని నగర ప్రజలను కరెంట్, మంచినీటి కష్టాలు ఎక్కువయ్యాయని వివరించారు. అంతేకాదు కరెంట్ బిల్లుపై ఫిక్స్డ్ చార్జీ వెనక్కి తీసుకోవాలని షీలా దీక్షిత్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ కూడా సానుకూలంగా స్పందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో కన్నా చార్జీలు తగ్గిస్తానని షీలా దీక్షిత్కు హామీనిచ్చినట్టు సమాచారం.

మారిన స్వరం ..
సమావేశం ముగిసాక ఆప్ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో సమస్యలను సీఎం కేజ్రీవాల్ దృష్టికి షీలాదీక్షిత్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సీఎం కేజ్రీవాల్ సమాధానం ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో చార్జీల తగ్గింపు, యాథాతథ స్థితి గురించి స్పస్టమైన హామీని కేజ్రీవాల్ ఇవ్వలేదని చెప్పారు.
దీంతో గంటల వ్యవధిలోనే కాంగ్రెస్, ఆప్ నేతల మాటల్లో తేడా కనిపిస్తోంది. అయితే ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కేజ్రీవాల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మంచినీరు ప్రజలకు కేటాయించాల్సి ఉంది. అలాగే విద్యుత్ చార్జీ ఫిక్స్డ్ చార్జీ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి షీలా దీక్షిత్ ప్రతిపాదన కూడా జనం బాగుకోరి చేశారని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications