రెబెల్స్ కు శివసేన అల్టిమేటం-సాయంత్రం 5 గంటల్లోగా రాకపోతే సస్పెండ్- ఇద్దరు తిరిగి రాక
మహారాష్ట్ర రాజకీయాలు గంటగంటకూ మారుతున్నాయి. నిన్న మంత్రి ఏక్ నాథ్ షిండే పార్టీలో సగానికి పైగా ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడంతో ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నాలుచేసిన సీఎం ఉద్ధవ్ థాక్రే విఫలమయ్యారు. దీంతో ఏకంగా ప్రభుత్వాన్ని రద్దు చేయించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. అయితే దీనికి మిత్రపక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ సిద్ధంగా లేకపోవడంతో శివసేన రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి రప్పించేందుకు మరో ప్రయత్నం ప్రారంభించారు.
ఏక్ నాథ్ షిండేతో వెళ్లిన రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి వచ్చేస్తారని సీఎం ఉద్ధవ్ థాక్రే ఆశిస్తున్నట్లు ముంబైకి కాంగ్రెస్ పరిశీలకుడిగా వెళ్లిన కమల్ నాథ్ వెల్లడించారు. అదే సమయంలో రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి వచ్చేందుకు సాయంత్రం ఐదు గంటల వరకూ డెడ్ లైన్ పెడుతున్నట్లు శివసేన ప్రకటించింది. ఆ లోపు రాకపోతే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తామని హెచ్చరించింది. దీంతో రెబెల్ ఎమ్మెల్యేలతో తాడోపేడే తేల్చుకునేందుకు ఉద్ధవ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

శివసేన డెడ్ లైన్ ప్రకటించిన నేపథ్యంలో ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి వచ్చేశారు. ఏక్ నాథ్ షిండేతో పాటు వెళ్లిన రెబెల్ ఎమ్మెల్యేలు కైలాశ్ పాటిల్, నితిన్ దేశ్ ముఖ్ తిరిగి వెనక్కి వచ్చేసినట్లు ప్రకటించారు. షిండే వర్గం తమను కిడ్నాప్ చేసిందని వీరిద్దరూ ఆరోపించారు.
అలాగే ఉద్ధవ్ థాకరే పై వారు విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు సాయంత్రం ఐదు గంటల వరకూ రెబెల్ ఎమ్మెల్యేలకు డెడ్ లైన్ ఇచ్చిన శివసేన.. ఇది ముగిసిన తర్వాత కీలక సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి కరోనాతో బాధపడుతున్న సీఎ ఉద్ధవ్ వర్చువల్ విధానంలో హాజరవుతారని తెలుస్తోంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications