CM meeting: ఎంత మంది ఎమ్మెల్యేలు వెళ్లారంటే ?, ఏక్ నాథ్ దెబ్బతో ఏడుపు మిగిలింది, ఊపుకుంటు వెళ్లారు!
ముంబాయి/గుహవాటి: శివసేన పార్టీ చీలిపోయే పరిస్థితి ఎదురైయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే శివసేన నాయకత్వం ఊహించని విదంగా శివసేన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో విజయం సాధించారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో ఇప్పటికే గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టిన ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ లో ఉన్న ఎమ్మెల్యేలను లాగేసుకుంటున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శిభిరంలో కేవలం 13 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారని వెలుగు చూడటంతో ఆ పార్టీ కార్యకర్తలు హడలిపోయారు. గురువారం సీఎం ఇంట్లో జరిగిన పార్టీ శాసన సభ్యుల సమావేశానికి 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనారు. శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 13 మంది మాత్రమే సీఎం ఉద్దవ్ ఠాక్రే వైపు ఉన్నారని స్పష్టంగా వెలుగు చూసింది.
Rebel camp: చీటి చింపేయడానికి ఒకేఒక్క ఎమ్మెల్యే తక్కువ అయ్యాడు, ఏక్ నాథ్ దెబ్బతో ఏమైనా జరగొచ్చు!
ఏక్ నాథ్ ఏం మంత్రం వేశాడో?
మహారాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే శివసేన నాయకత్వం ఊహించని విదంగా శివసేన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో విజయం సాధించారు. శివసేన పార్టీ రెబల్ నాయకుడు ఏక్ నాథ్ ఏం మంత్రం వేశాడో ?, ఎమ్మెల్యేలకు ఏం చెప్పాడో కాని సొంత పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన్ను ఏమాత్రం పట్టించుకోకుండా రెబల్ గ్రూప్ లోకి వెళ్లిపోతున్నారు.
ఊపుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యేలు
గురువారం ముంబాయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సొంత నివాసం మాతోశ్రీలో శివసేన పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేలకు సీఎం ఇంట్లో జరుగుతున్న సమావేశానికి హాజరుకావాలని సమాచారం ఇచ్చారు. అయితే సీఎం ఉద్దవ్ ఠాక్రే నిర్వహించిన పమావేశానికి కేవలం 13 మంది ఎమ్మ్యేలు హాయిగా చేతులు ఊపుకుంటూ వెళ్లారు.
బిత్తరపోయిన సీఎం
ఎమ్మెల్యేల అత్యవసర సమావేశానికి కేవలం 13 మంది వచ్చారని తెలుసుకున్న సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆందోళనకు గురైనారని తెలిసింది. ఒక్కరోజులోనే రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోవడంతో ఉద్దవ్ ఠాక్రేతో పాటు శివసేన నాయకులు హడలిపోయారని తెలిసింది. ఈ 13 మంది ఎమ్మెల్యేల్లో ఇంకా ఎంతమంది జంప్ అవుతోతారో అని విచారం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.
ఏక్ నాథ్ నాయకత్వం ఓకే
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే శిభిరంలో కేవలం 13 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారని వెలుగు చూడటంతో ఆ పార్టీ కార్యకర్తలు హడలిపోయారు. గురువారం సీఎం ఇంట్లో జరిగిన పార్టీ శాసన సభ్యుల సమావేశానికి 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనారని శివసేనకు చెందిన ఓ సీనియర్ నాయకుడు మీడియాకు చెప్పారు. శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 13 మంది మాత్రమే సీఎం ఉద్దవ్ ఠాక్రే వైపు ఉన్నారని, మిగిలిన వాళ్లు ఏక్ నాథ్ షిండే నాయకత్వానికి మద్దతు ఇస్తున్నారని స్పష్టంగా వెలుగు చూసింది.