బీజేపీకి ఝలక్: 2019లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం
ముంబై: మహారాష్ట్రలో బీజేపీకి గట్టి షాక్. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన నిర్ణయించింది. సుదీర్ఘకాలంగా అంటే 29 ఏళ్లుగా మహారాష్ట్రలో బీజేపీ - శివసేన కలిసి ప్రయాణం చేశాయి. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.
నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. 2019లో జరిగిగే సార్వత్రిక ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా, ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

పార్టీ నేత సంజయ్ రౌత్ ఈ మేరకు ముంబైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తీర్మానం పెట్టారు. ఈ తీర్మానాన్ని ఏకాభిప్రాయంతో ఆమోదించారు. 48 లోకసభ స్థానాలకు గాను కనీసం 25 చోట్ల, 288 శాసన సభ స్థానాలకు గాను 150 స్థానాల్లో విజయం సాధించాలని తీర్మానించుకుంది.












Click it and Unblock the Notifications