అఖిలేష్కు తగిన శాస్తి జరిగింది: శివ్పాల్యాదవ్ సంచలనం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లో లుకలుకలను బయటపెట్టాయి. ఎన్నికల వరకు తీవ్రంగా విమర్శలు చేసుకుని.. ఆ తర్వాత కొద్దిరోజులపాటు మౌనంగా ఉన్న యూపీ ప్రస్తుత సీఎం అఖిలేష
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లో లుకలుకలను బయటపెట్టాయి. ఎన్నికల వరకు తీవ్రంగా విమర్శలు చేసుకుని.. ఆ తర్వాత కొద్దిరోజులపాటు మౌనంగా ఉన్న యూపీ ప్రస్తుత సీఎం అఖిలేష్ యాదవ్ వ్యతిరేక వర్గం మరోసారి ఆయనపై తీవ్రస్తాయిలో మండిపడింది.
శనివారం ఓ వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే అఖిలేష్పై ఆయన బాబాయి శివ్పాల్ యాదవ్ ధ్వజమెత్తారు. ఈ ఫలితాలు పార్టీకి నష్టం కాదని.. గర్వానికి గుణపాఠం అని పేర్కొన్నారు.

'ఇది సోషలిస్టుల (ఎస్పీ) పరాజయం కాదు.. ఇది గర్వభంగం.. నేతాజీ(ములాయం)ని పార్టీ నుంచి తొలగించారు.. నన్ను అవమానపర్చారు' అని వ్యాఖ్యానించారు. కాగా, జశ్వంత్నగర్ స్థానం నుంచి దాదాపు 35వేల ఓట్ల తేడాతో శివ్పాల్ యాదవ్ విజయం సాధించారు శివపాల్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పైవిధంగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications