సింధియా అనుచరుడికి వైద్యారోగ్యశాఖ: చౌహాన్ నుంచి నరోత్తం మిశ్రాకు చేరిన హెల్త్ మినిస్ట్రీ...
మధ్యప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. అయితే ఇటీవల అక్కడ ప్రభుత్వం మారడంతో వైద్యారోగ్యశాఖ బాధ్యతలను కూడా సీఎం శివరాజ్ సింగ్ చూశారు. మంగళవారం మంత్రివర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఆ ఐదుగురిలో కూడా ఎవరికీ వైద్యారోగ్య శాఖను అప్పగించలేదు చౌహాన్.
మధ్యప్రదేశ్లో ప్రభుత్వం మారేందుకు కారణమైన నరోత్తం మిశ్రాకు వైద్యారోగ్య శాఖ బాధ్యతలను అప్పగించారు. నరోత్తం మిశ్రా.. జ్యోతిరాదిత్య సింధియా ప్రధాన అనుచరుడు, ఇతనికి అమిత్ షాతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో.. చౌహాన్ కాకుంటే నరోత్తం మిశ్రాకు సీఎం పదవీ కట్టబెట్టాలని అనుకొన్నారు. కానీ చివరికి హై కమాండ్ చౌహాన్కు మొగ్గుచూపడంతో చివరికి మిశ్రా క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. వైద్యారోగ్యశాఖతోపాటు హోంమంత్రి పదవీ కూడా చేపడతారు.

చౌహాన్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరోత్తం మిశ్రా... కమల్ నాథ్ ప్రభుత్వం ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇటు సిందియా మరో అనుచరుడు గోబింద్ సింగ్ రాజ్ పూత్కు పౌరసరఫరాల పోర్టుపోలియో దక్కింది. కమల్ నాథ్ ప్రభుత్వంలో ఈయన రవాణాశాఖ చూశారు. సింధియా అనుచరులకు బీజేపీ ప్రాధాన్యం ఇచ్చింది. కేంద్ర మంత్రి పదవీ కూడా ఇస్తానని ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications