మళ్లీ అధికారంలోకి వచ్చాక నీ పని చెప్తా! కలెక్టర్కు మాజీ సీఎం వార్నింగ్!
Recommended Video
చింద్వారా : ఒకవైపు తీరికలేని ఎన్నికల ప్రచారం మరోవైపు ఠాఠెత్తిస్తున్న ఎండలు వెరసి రాజకీయ నాయకులు సహనం కోల్పోయేలా చేస్తున్నాయి. ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చింద్వారాలో తన హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి నిరాకరించడంతో ఆయన కలెక్టర్ను బెదిరించడం వివాదాస్పదమైంది.
వారణాసిలో మోడీ వర్సెస్ అజయ్ రాయ్! ప్రియాంక పోటీపై వీడిన సస్పెన్స్!
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చౌహాన్ చింద్వారా జిల్లాలోని ఉమ్రేత్కు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం ఆయన సాయంత్రం 5.30గం.లకు హెలికాప్టర్లో వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అయితే జిల్లా అధికారులు మాత్రం సాయంత్రం 5గంటలలోపే హెలికాప్టర్ ల్యాండింగ్కు పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన మాజీ ముఖ్యమంత్రి కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తిరిగి అధికారంలోకి వస్తే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా అని బెదిరించారు.
బెంగాల్లో మమత బెనర్జీలాగే మధ్యప్రదేశ్లో సీఎం కమల్నాథ్ తమ హెలికాప్టర్లు ల్యాండ్ కాకుండా అడ్డుకుంటున్నారని చౌహాన్ మండిపడ్డారు. తాను ప్రచారం నిర్వహించిన ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని వాపోయారు. సాయంత్రం ఆరింటి వరకు అనుమతి కోరినా కలెక్టర్ అంగీకరించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు. మూడుసార్లు మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాశంగా మారాయి.