వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒలింపిక్స్‌పై శోభా డే వివాదాస్పద వ్యాఖ్యలు, నెటిజన్ల ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారుల పైన ప్రముఖ రచయిత్రి శోభాడే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెల్ఫీలు తీసుకోవడం, ఉత్త చేతులతో తిరిగి రావడం.. ఒలింపిక్స్‌లో భారత జట్టు లక్ష్యమిదే, అవకాశం, డబ్బు రెండూ వృథా అని ఆమె ట్వీట్ చేశారు.

ఆమె ట్వీట్ పైన పలువురు మండిపడ్డారు. క్రీడాకారులను నిరుత్సాహపరిచేలా మాట్లాడవద్దని ధ్వజమెత్తారు. నెటిజన్లు ఆమె పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. శోభా డే వ్యాఖ్యలు సరికాదని కొందరు క్రీడాకారులు కూడా అన్నారు.

Shobhaa De defends herself on insulting Indian athletes

తన పైన వచ్చిన విమర్శలకు శోభా డే స్పందించారు. తన ట్వీట్‌ను ఆమె సమర్థించుకున్నారు. తాను అన్న దాంట్లో తప్పేమీ లేదని, తన ట్వీట్‌కు క్షమాపణ చెప్పబోనని శోభ డే చెప్పారు.

తన ట్వీట్ అథ్లెట్లకు వ్యతిరేకం కాదని చెప్పారు. నేను మన ఆటగాళ్లకు మద్దతిస్తానని చెప్పారు. తాను ఆటగాళ్లకు సరైన సదుపాయాలు కల్పించని స్పోర్ట్ అథారిటీని అన్నానని చెప్పారు. రియో ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతా తెరవని విషయం తెలిసిందే.

English summary
Famous Indian novelist and columnist Shobhaa De instigated a big controversy yesterday (August 8) after she tweeted, "Goal of Team India at the Olympics: Rio jao. Selfies lo. Khaali haat wapas aao. What a waste of money and opportunity."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X