Shock: షాపులో అనుమతి లేకుండా సమోసాలు తిన్నాడు. కోపం తట్టుకోలేక తండ్రీ కొడుకు ఏం చేశారంటే, ప్రాణం !
భోపాల్/మధ్యప్రదేశ్: తండ్రీ కొడుకులు వాళ్లు నివాసం ఉంటున్న ఏరియాలోనే టీ, సమోసా, స్నాక్స్ షాపు నిర్వహిస్తున్నారు. తండ్రీ కొడుకు నిర్వహిస్తున్న టీ, సమోసా షాపు ఆ ఏరియాలోనే చాలా ఫేమస్. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆ టీ షాపులో ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇదే ప్రాంతంలో మద్యం సేవించే వాళ్లు ఆ షాపులోనే సమోసాలు తీసుకుని వెలుతుంటారు. స్థానికంగా నివాసం ఉంటున్న వ్యక్తి రాత్రి పీకలదాక మద్యం సేవించి టీ షాపు దగ్గరకు వెళ్లాడు. షాపులో తండ్రీ కొడుకు ఇద్దరూ ఉన్నారు. తండ్రీ కొడుకు అనుమతి లేకుండా ఆ తాగుబోతు షాపులో ఉన్న రెండు సమోసాలు ఎత్తుకుని తిన్నాడు. విషయం తెలుసుకున్న తండ్రీ కొడుకు మా అనుమతి లేకుండా ఎందుకు సమోసాలు ఎత్తుకున్నావు అంటూ తాగుబోతుతో గొడవ పెట్టుకున్నారు. ఆ సమయంలో తాగుబోతుతో తండ్రీ కొడుకు గొడవ పెట్టుకున్నారు, ఆ సమయంలో సహనం కోల్పోయిన తండ్రి కొడుకు కలిసి తాగుబోతును కొట్టి చంపేశారు. అనుమతి లేకుండా సమోసా తిన్న వ్యక్తి హత్యకు గురి కావడం కలకలం రేపింది.
ఫేమస్ టీ షాపు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సిటీలోని అహిర్వార్ ప్రాంతంలో హరీసింగ్ అనే వ్యక్తి టీ, సమోసా దుకాణం నడుపుతున్నాడు. తండ్రీ హరీసింగ్, అతని కొడుకు సీతారామ్ కలిసి వాళ్లు నివాసం ఉంటున్న ఏరియాలోనే టీ, సమోసా, స్నాక్స్ షాపు నిర్వహిస్తున్నారు. తండ్రీ కొడుకు హరీసింగ్, సీతారామ్ నిర్వహిస్తున్న టీ, సమోసా షాపు ఆ ఏరియాలోనే చాలా ఫేమస్.
సమోసా ప్రియులు
హరీసింగ్ నిర్వహిస్తున్న టీ, సమోసా షాపులో దయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇదే ప్రాంతంలో మద్యం సేవించే వాళ్లు హరీసింగ్ షాపులోనే సమోసాలు తీసుకుని వెలుతుంటారు. స్థానికంగా నివాసం ఉంటున్న వినోద్ అనే రాత్రి పీకలదాక మద్యం సేవించి హరీసింగ్ టీ షాపు దగ్గరకు వెళ్లాడు.
సమోసాలు తినేశాడు
షాపులో తండ్రీ హరీసింగ్, అతని కొడుకు సీతారామ్ ఇద్దరూ ఉన్నారు. తండ్రీ కొడుకు అనుమతి లేకుండా తాగుబోతు వినోద్ షాపులో ఉన్న రెండు సమోసాలు ఎత్తుకుని తిన్నాడు. విషయం తెలుసుకున్న తండ్రీ కొడుకు హరీసింగ్, సీతారామ్ మా అనుమతి లేకుండా ఎందుకు సమోసాలు ఎత్తుకున్నావు అంటూ తాగుబోతు వినోద్ తో గొడవ పెట్టుకున్నారు.
ప్రాణం తీసిన సమోసా
ఆ సమయంలో తాగుబోతు వినోద్ తో తండ్రీ కొడుకు హరీసింగ్, సీతారామ్ పెద్ద గొడవ పెట్టుకున్నారు, ఆ సమయంలో సహనం కోల్పోయిన తండ్రి కొడుకు హరీసింగ్, సీతారామ్ కలిసి తాగుబోతు వినోద్ ను చితకబాదేశారు. తండ్రీకొడుకు కొట్టిన దెబ్బలకు వినోద్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనుమతి లేకుండా సమోసా తిన్న వినోద్ హత్యకు గురి కావడం భోపాల్ లో కలకలం రేపింది.