Bengaluru: పోలీసు కమీషర్ ఆఫీసు పక్కలో చేతివాటం ?, కారులో లక్షలు లూటీ, సీసీటీవీ !
బెంగళూరు: బెంగళూరులో కిలాడీలు మరోసారి చేతివాటం చూపించారు. బెంగళూరులో నిత్యం ఎక్కడో అక్కడ ఇళ్లల్లో చోరీలు, దొంగతనాలు, దారి దోపిడీలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈసారి నిందితులు ధైర్యం చేసి బెంగళూరు సిటీ పోలీస్ బాస్ కార్యాలయం సమీపంలో పట్టపగలు బరి తెగించి కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న లక్షల రూపాయల నగదు లూటీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. నిందితులు దర్జాగా నగదు లూటీ చేసి పల్సర్ బైక్ లో పారిపోతున్న సమయంలో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

బ్యాంకు లోన్ డబ్బులు
బెంగళూరు నగరంలోని మహదేవపురలో లక్షీశ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. లక్ష్మీశ ఇంటి ఇఎంఐ కట్టడానికి శనివారం ఇండియన్ ఎక్స్ ప్రెస్ సర్కిల్ సమీపంలోని కెనరా బ్యాంకుకు వెళ్లారు. ఆ సందర్బంలో రూ. 4.50 లక్షలు బ్యాంకులో కట్టడానికి పాన్ కార్డు అవసరం అని బ్యాంకు సిబ్బంది చెప్పారు.

ఫ్రెండ్ కోసం వెళ్లాడు
పాన్ కార్డు లేకపోవడంతో బ్యాంకులో డబ్బులు తరువాత కడితే సరిపోతుంది అనుకున్న లక్ష్మీశ డబ్బులు వెనక్కి తీసుకుని కారులో పెట్టాడు. ఇంటికి వెలుతున్న సమయంలో బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయం సమీంలోని కార్యాలయంలో పని చేస్తున్న స్నేహితుడిని మాట్లాడటానికి వెళ్లాడు

కారులో రూ. 4.50 లక్షలు లూటీ
ఆ సందర్బంలో కారులోనే బ్యాంకు ఇఎమ్ఐకి కట్టడానికి తీసుకెళ్లిన రూ. 4.50 లక్షలు ఉన్న బ్యాగ్ అక్కడే పెట్టి వెళ్లాడు. ఫ్రెండ్ మాట్లాడి వచ్చి చూసే సరికి తన కారు అద్దాలు పగలగొట్టిన నిందితులు అందులోని రూ. 4.50 లక్షలు లూటీ చేశారని లక్ష్మీశ పోలీసులను ఆశ్రయించాడు.

కమీషనర్ ఆఫీసు పక్కలో చేతివాటం ?
నిందితులు లక్ష్మీశ కారు అద్దాలు పగలగొట్టి సమీపంలో పల్సర్ బైక్ లో ఉన్న మరో నిందితుడితో పారిపోతున్న సమయంలో రికార్డు అయిన సీసీటీవీ క్లిప్పింగ్స్ చూసిన పోలీసులు హడలిపోయారు. బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయం సమీపంలోనే కారులో పెద్ద మొత్తంలో నగదు చోరీ కావడం హాట్ టాపిక్ అయ్యింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications