కాంగ్రెస్ పార్టీ ముస్లీంలకు మాత్రమే, తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం, సీఎం చాలా సీరియస్ !
కాంగ్రెస్ పార్టీ ముస్లిం మతాన్ని, ముస్లీం జాతిని నమ్ముతుందని, కాంగ్రెస్ పార్టీకి హిందూ మతంపై నమ్మకం లేదని, గతంలో కాంగ్రెస్ నేతలు పార్టీ లోగోను మార్చారని, కాంగ్రెస్ పార్టీ ముస్లిం ప్రాతిపదికన ఏర్పాటు చేశారని, హిందూ మతం మీద కాంగ్రెస్ కు నమ్మకం లేదని, హిందువుల ఓట్లపై మేము ఆదారపడటం లేదని, కాంగ్రెస్ కార్యకర్తలు హిందుత్వాన్ని నమ్మవద్దని సీఎం సిద్ధరామయ్య ఓ ప్రైవేట్ మీటింగ్లో చెప్పారని కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య హిందువుల గురించి ఇలా మాట్లాడారని ప్రముఖ కన్నడ పత్రికలో వార్త ప్రచురించారని ఓ వార్త బయటకు రావడం కలకలం రేపింది. ఈ వార్తల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. బీజేపీ-జేడీఎస్ కూటమి స్పాన్సర్ చేసిన ప్రకటనలను ఓ వార్తాపత్రిక తరహాలో ఫేక్ న్యూస్ సృష్టించారని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే ఇలాంటి వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

దీనిపై ఇప్పటికే తాను కర్ణాటక పోలీసు శాఖకు ఫిర్యాదు చేశానని, దీని వెనుక ఉన్న దుష్టశక్తుల గురించి మా వద్ద సమాచారం ఉందని, వీలైనంత త్వరగా వారికి గుణపాఠం చెబుతామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. తమ రాజకీయ ప్రత్యర్థులను నిష్పక్షపాతంగా ఎదుర్కోలేక ఇలా పక్కదారిలో లోక్ షభ ఎన్నికల్లో గెలుపొందడానికి బీజేపీ, జేడీఎస్ పార్టీలు కుట్రపన్నుతున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు.
ಬಿಜೆಪಿ – ಜೆಡಿಎಸ್ ಮಿತ್ರಮಂಡಳಿ ಕೃಪಾಪೋಷಿತ ಕಿಡಿಗೇಡಿಗಳು ವಾರ್ತಾಪತ್ರಿಕೆಯನ್ನು ಹೋಲುವ ಸುಳ್ಳು ಸುದ್ದಿಯ ತುಣುಕೊಂದನ್ನು ಸೃಷ್ಟಿಸಿ, ಅದರಲ್ಲಿ ಜನರ ಕೋಮುಭಾವನೆ ಕೆರಳಿಸುವ ಸುದ್ದಿಯನ್ನು ತುಂಬಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಹರಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಈ ಬಗ್ಗೆ ಈಗಾಗಲೇ ನಾನು ಪೊಲೀಸ್ ಇಲಾಖೆಗೆ ದೂರು ನೀಡಿದ್ದೇನೆ. ಇದರ ಹಿಂದಿರುವ ದುಷ್ಟ ಶಕ್ತಿ… pic.twitter.com/6Gin6L9Dvz
— Siddaramaiah (@siddaramaiah) April 10, 2024
బీజేపీ, జేడీఎస్ ల దివాళాకోరుతనాన్ని ఇలాంటి ఫేక్ న్యూస్ తెలియజేస్తోందని, పదేళ్లపాటు దేశాన్ని పాలించిన పార్టీ లోక్ సభ ఎన్నికల్లో గెలవడానికి ఫేక్ న్యూస్ను ఆశ్రయించే స్థాయికి చేరుకోకూడదని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. ఫేక్ న్యూస్లను నమ్మి అలాంటి న్యూస్ షేర్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి అని సీఎం సిద్దరామయ్య ప్రజలకు మనవి చేశారు. ఫేక్ న్యూస్ సృష్టికర్తలు, వారికి వెన్నుదన్నుగా మద్దతు ఇచ్చేవారు ఇలాంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని ఆశ్రయిస్తున్నారని, వారిని కచ్చితంగా నిర్మూలిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు.
-
శివరాత్రి రోజు మటన్ తిన్నా.. శుభ ముహూర్తాలను నమ్మను: సీఎం సంచలనం -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications