బీహార్ కింగ్మేకర్: నితీష్ గెలుపును శాసిస్తోన్న 'సైలెంట్ ఫోర్స్'?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సారి బీహార్ లో అధికారం ఎవరికి దక్కుతుందో త్వరలోనే తేలిపోనుంది. నితీష్ కుమార్ మళ్లీ సీఎం అవుతారా లేదా అధికారాన్ని కోల్పోతారా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉంది. అయితే ఫలితాలు ఏమైనప్పటికీ.. దాని వెనుక ఒక 'సైలెంట్ ఫోర్స్' పనిచేస్తోంది. ఈ 'సైలెంట్ ఫోర్స్' బీహార్లో ఒక పెద్ద శక్తిగా ఉద్భవించింది. ఈ సైలెంట్ ఫోర్సే బీహార్లో ఎవరి పాలన ఉండబోతుందో నిర్ణయిస్తుందని ఎన్నికల నిపుణులు చెబుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో ఈ సైలెంట్ ఫోర్సే సీఎం ఎవరో నిర్ణయించనుంది. ఆ సైలెంట్ ఫోర్స్ మరెవరో కాదు.. మహిళా ఓటర్లు.
స్వాతంత్య్రం తర్వాత 4 సార్లు మాత్రమే 60 శాతం దాటిన ఓటింగ్
బీబీసీ నివేదిక ప్రకారం.. 1951-52 నుండి 2020 వరకు జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం మూడు సార్లు మాత్రమే ఓటింగ్ శాతం 60 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఎన్నికల సంఘం ప్రకారం.. ఈసారి 2025లో రెండు దశల అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం సుమారు 66.91 శాతంగా నమోదైంది. ఇది 2020 ఎన్నికల (57.29%) కంటే దాదాపు 10 శాతం ఎక్కువ. ఇందులో మహిళలు కీలక పాత్ర పోషించారు.

పురుషుల కంటే మహిళలే ఓట్లే అధికం
ఈసారి రెండు దశలలో, పురుషుల కంటే కనీసం 4,34,000 మంది మహిళలు ఎక్కువగా ఓటు వేశారు. శాతం పరంగా చూస్తే, మహిళల ఓటింగ్ శాతం 71.6 శాతం ఉండగా, పురుషుల ఓటింగ్ శాతం 62.8 శాతంగా ఉంది. అంటే మొత్తం మీద పురుషుల కంటే మహిళలు 10 శాతం అధికంగా ఓటు వేశారు.
ఒకరికి 'సైలెంట్ కిల్లర్'.. మరొకరికి 'కింగ్మేకర్'
బీహార్లో ఈ మహిళలే 'సైలెంట్ ఫోర్స్'గా మారుతున్నారు. వీరు కులం, మతాలకు అతీతంగా ఓటు వేసి అధికార సమీకరణాలను నిర్ణయిస్తారు. ఈ మహిళలు ఏ పార్టీకైనా 'సైలెంట్ కిల్లర్'గా మారవచ్చు, లేదా మరొకరికి అధికారాన్ని అందించవచ్చు అనేది కూడా చూడాలి. బీహార్లో మద్యపాన నిషేధం అమలు చేయడంతో నితీష్ కుమార్కు మహిళల్లో మంచి ప్రజాదరణ ఉంది. ఈ కారణంగా ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా వస్తే, నితీష్ కుమార్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రి కావచ్చు.
మహిళా ఓటింగ్ శాతాన్ని పెంచిన కొన్ని పథకాలు
కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 2025 అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో బీహార్లోని మొత్తం 243 స్థానాల్లో మహిళలు భారీగా ఓటు వేశారు. ఈసారి మహిళల మొగ్గు నితీష్ కుమార్ వైపు కనిపిస్తోందని వారు అంటున్నారు. కేవలం రూ. 10,000 ఆర్థిక సహాయం పథకమే కాకుండా.. గత 20-25 సంవత్సరాలలో సైకిల్ పథకం నుంచి ఇతర సంక్షేమ పథకాలు మహిళల్లో ఒక శాశ్వత సానుకూలతను సృష్టించాయని వారు పేర్కొంటున్నారు.
చైతన్యమవుతున్న మహిళలు
రికార్డు స్థాయిలో నమోదైన ఓటింగ్ను బట్టి అధికారం మారుతుందని లేదా మారదని మనం నిర్ధారించలేమని నిపుణులు అంటున్నారు. మహిళలు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారంటే.. అది ఎవరో గెలవడానికో లేదా ఓడిపోవడానికో కాదు. మహిళలు తమ అభిప్రాయాలను ముందు ఉంచుతున్నారు కాబట్టి ఓటు వేస్తున్నారు. అందుకే మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా పరిగణించబడుతుంది. ఇక్కడ పురుష ఓటర్ల కంటే మహిళలు ఎక్కువగా పోలింగ్లో పాల్గొంటున్నారు.
పురుషుల కంటే మహిళలకు కులం అంత ముఖ్యం కాదు..
బీహార్లో పురుష ఓటర్లకు కులం చాలా ముఖ్యమైనది, కానీ మహిళా ఓటర్లకు అది అంత ముఖ్యమైనది కాదు. ఈసారి నితీష్ కుమార్ మహిళల కారణంగా రికార్డు సంఖ్యలో స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తే, ఇండియాలో ఓ కొత్త రకమైన నిర్ణయాత్మక ఓటు బ్యాంకు స్థాపించబడుతుంది. మహిళలకు ఇచ్చే డబ్బును తాను సంక్షేమ పథకంగా భావించడం లేదని నిపుణులు అంటున్నారు. ఆ డబ్బు కుటుంబం, పోషణ, ఆరోగ్యం, విద్య, వారి చిన్న చిన్న పరిశ్రమలకు వెళ్లి, సమాజానికి మెరుగైన రీతిలో తిరిగి వస్తుంది.












Click it and Unblock the Notifications