ఇంజిన్లో పొగ: విమానం అత్యవసర ల్యాండింగ్
చెన్నై: సింగపూర్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల 170 ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు. సింగపూర్కు చెందిన స్కూట్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
170 మంది ప్రయాణికులతో స్కూట్ ఎయిర్లైన్స్ విమానం నంబర్ ఎస్సీఓ 567 తమిళనాడులోని తిరుచ్చి నుంచి సింగపూర్కు బయలుదేరింది. టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే విమానం ఇంజిన్లో అవాంఛనీయ శబ్దాలు వినిపించాయి. కొద్దిసేపటికే పొగ వెలువడింది. ప్రమాదాన్ని శంకించిన పైలెట్ వెంటనే సమీపంలోని చెన్నై విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించారు.

ఏటీసీ అనుమతి ఇవ్వడంతో విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇంజిన్ నుంచి పొగ రావడానికి గల కారణాలను ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు. విమానం సాయంత్రం 5 గంటల సమయంలో సింగపూర్కు బయలుదేరి వెళ్తుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications