అసహనంపై అద్నాన్, తెలుగులోనూ పాటలు పాడారు
ఢిల్లీ: భారత్లో అసహనం ఏమాత్రం లేదని, అసహనం ఉండి ఉంటే తాను ఈ దేశ పౌరసత్వాన్ని తీసుకొని ఉండేవాడిని కాదని ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ చెప్పారు. రెండు రోజుల క్రితం అద్నాన్ సమీకి భారత ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది.
భారత్లో తాను ఎప్పుడూ అసహనాన్ని ఎదుర్కోలేదని చెప్పారు. తనకు పౌరసత్వాన్ని మంజూరు చేసినందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లకు రుణపడి ఉంటానని ట్విట్టర్లో పేర్కొన్నరు. అతను జై హింద్ అని కూడా ట్వీట్ చేశారు. భారత్ పౌరుడిని అవుతున్నందుకు గర్విస్తున్నట్లు చెప్పారు.
కాగా, తన గాత్రంతో లక్షలాది ప్రేక్షకులను అలరించిన అద్నాన్ సమీ పాకిస్తాన్ పౌరసత్వాన్ని వదులుకొని భారతీయ పౌరసత్వాన్ని అందుకునున్నారు. గతంలో ఈయన తెలుగులో పాడిన 'ఏ జిల్లా ఏ జిల్లా' పాట సంగీత ప్రియులను అలరించింది.

వర్షం, మహానంది, యోగి, ఆడువారి మాటలకు అర్దాలే వేరులే, శంకర్ దాదా జిందాబాద్, 100%లవ్, ఊసరవెల్లి, ఇష్క్, జులాయి, గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం, టెంపర్ తదితర చిత్రాలలో ఆయన పాటలు పాడారు.
హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, అస్సామీ లాంటి ఎన్నో భారతీయ భాషల్లో పాటలు పాడిన అద్నాన్ సమీ జనవరి 1, 2016 నుండి భారత పౌరుడిగా మారారు. పాకిస్తాన్కు చెందిన అద్నాన్ సమీ 2001 నుండి భారత్లోనే నివాసం ఉంటున్నారు. ఇతను 1975 ఆగస్టు 15న జన్మించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications