దండుపాళ్యం తరహాలో: మహిళపై కిరాతకం: పట్టపగలు..బెడ్రూమ్లో..గొంతుకోసి..!
బెంగళూరు: ఉద్యాననగరిగా పేరున్న బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తోన్న ఓ మహిళ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ మహిళను అత్యంత పాశవికంగా గొంతుకోసి హత్య చేశారు. అనంతరం దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ ఘటన బెంగళూరులో కలకలాన్ని రేపింది. మహిళలకు రక్షణ లేదనే విషయాన్ని స్పష్టం చేసినట్టయింది. దండుపాళ్యం ముఠా కిరాతకాన్ని గుర్తుకు తెచ్చినట్టయింది.
మృతురాలి పేరు మంజుల. వయస్సు 40 సంవత్సరాలు. ఆరు నెలలుగా ఆమె గాయత్రి నగరలో నివసిస్తున్నారు. కుటుంబ కలహాల వల్ల భర్తకు దూరంగా ఉంటున్నారు. తన కుమారుడితో కలిసి గాయత్రి నగరకు నివాసాన్ని మార్చినప్పటి నుంచీ ఆమె చీటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. కత్తితో గొంతు కోసం దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని బెడ్రూమ్లో పడేశారు.

ఇంట్లో ఉన్న కొన్ని విలువైన వస్తువులను చోరీ చేశారు. సుమారు రెండు గంటల తరువాత పొరుగింట్లో నివసిస్తోన్న వారు మంజుల ఇంటికి వెళ్లగా.. ఈ హత్యోదంతం వెలుగు చూసింది. బెడ్రూమ్లో రక్తపు మడగులో పడి ఉన్న మంజుల మృతదేహాన్ని చూసిన వెంటనే వారు ఆమె కుమారుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సుబ్రహ్మణ్య నగర పోలీస్స్టేషన్కు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం ఎంఎస్ రామయ్మ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్త చేస్తున్నామని సుబ్రహ్మణ్య నగర ఎస్ఐ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నామని అన్నారు. మంజుల కుమారుడి ద్వారా పూర్తి విషయాలను సేకరించారు. చీటీ నిర్వహిస్తున్న కారణంగా- దానికి సంబంధించిన వివదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చనే కోణంలోనూ విచారణ చేపడతామని తెలిపారు. మంజులను హత్యోదంతం తెలిసిన వారి పనే అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications