ఇంట్లో కోపంతో ఫ్రీ బస్సు ఎక్కి అక్కాచెల్లెలు ఎక్కడికి వెళ్లిపోయారంటే ? !
బెంగళూరు/ధర్మస్థలం: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ఐదు హామీల్లో ఒక్కటైన శక్తి పథకం కింద కర్ణాటకలో పుట్టిపెరిగి ఆ రాఫ్ట్రంలో నివాసం ఉంటున్న మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైన ఉచితంగా సంచరించడానికి సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మహిళలు ప్రభుత్వ ఆర్ టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడం మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ మహిళలు పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ శక్తి పథకం వల్ల చాలా మంది మహిళలకు మేలు జరిగితే కొందరికి బాధను తెచ్చిపెట్టింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల భార్య ఇంట్లో ఉండడం లేదని, వంట చేయడం లేదని, ఇప్పటికీ మాకు బస్సులో సీటు దొరకడం లేదని శక్తి పథకంపై యోజన చాలా మంది పురుషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కూతుళ్లు కనిపించకుండా పోయారని తల్లిదండ్రులు బెంగళూరులోని కోణేణకుంటే పోలీస్ స్టేషన్లో కన్నీరుమున్నీరు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు సర్వీస్ కల్పించడం వలనే మా కూతుర్లు మాయం అయ్యారని ఆ తల్లిదండ్రులు ఆరోపించారు. చాక్లెట్లు కొనుక్కోవాలని ఇద్దరూ అక్కాచెల్లెళ్లు వాళ్ల తండ్రి డబ్బులు అడిగాడు,
ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని, మీరు డబ్బు అనసరంగా ఖర్చు చేస్తున్నారని తండ్రి కోపం చేసుకన్నాడు. అంతే 9వ తరగతి, 10వ తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్లు డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయారని ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు అమ్మాయిలు కనిపించడం లేదని బెంగళూరులోని కోణేణకుంటే పోలీస్ స్టేషన్లో వాళ్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు చాక్లెట్లు కొనివ్వలేదనే కోపంతో ఇద్దరు అమ్మాయి బెంగళూరులోని కేఎస్ఆర్ టీసీ బస్సు ఎక్కి పవిత్ర పుణ్యక్షేత్రం అయిన ధర్మస్థలానికి వెళ్లారు. చాక్లెట్లకు తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఇద్దరు కూతుళ్లు బెంగళూరులో బస్సు ఎక్కి ధర్మస్థలానికి ఉచితంగా ప్రయాణం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించడంతో అక్కాచెల్లెలు హ్యాపీగా రెండు రోజుల నుంచి ధర్మస్థలంలో ఉండిపోయారు.

ఈ విషయం తెలియని తల్లిదండ్రులు నివ్వెరపోయి కోణేణకుంటే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు అమ్మాయిల కోసం వెతికారు. అమ్మాయిల ఫోటోలు కర్ణాటకలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అమ్మాయిలు కనిపించకుండా పోయిన రెండు రోజుల తర్వాత జూన్ 18వ తేదీన ఆదివారం రాత్రి ధర్మస్థలంలో స్థానిక పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరు అమ్మాయిలు కనపడటంతో వాళ్ల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం ఉదయం తల్లిదండ్రులకు ఇద్దరు అమ్మాయిలను అప్పగించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications