కర్నాటకలో బస్సు ప్రమాదం, ఆరుగురు సజీవ దహనం
బెంగళూరు: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. మరో పన్నెండు మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు దావణగెరె నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో చిత్రదుర్గ వద్ద ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

దావణగెరె నుంచి బెంగళూరు వెళ్తుండగా హిరాయూరు తాలుకా మేటికుర్తి వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. హిరియూరు నుండి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సు ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
బంగారం స్వాధీనం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.15 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మణప్పురం ఫైనాన్స్ సంస్థకు చెందిన ఈ బంగారాన్ని సరైన పత్రాలు లేకుండా తరలిస్తుండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications