పాకిస్తాన్లో ముద్రించిన నకిలీ నోట్లు: రూ.9.13 లక్షలు సీజ్
బెంగళూరు: పాకిస్థాన్ లో ముద్రించిన నకిలీ నోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నించిన అంతర్జాతీయ ముఠా సభ్యులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన షబ్బీర్ ఆలీ, మసూద్, గౌరిబిదనూరు నివాసి అఫ్రోజ్, మైసూరు నివాసి ఆఫీస్ వుల్లాఖాన్, మహీద్ వుల్లాఖాన్, సయ్యద్ హఫీజ్లను అరెస్టు చేశారు.
ఈ ముఠా నుండి రూ.9.13 లక్షల నకిలీ నోట్లు, రూ.1.72 లక్షలు (అసలైన నోట్లు), టాటా ఇండికా కారు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం ఎన్ రెడ్డి మంగళవారం తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

నిందితులు సోమవారం రాత్రి బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఎ నారాయణ పుర దగ్గర టాటా ఇండి కారులో నకిలి నోట్లు పెట్టుకుని చలామణి చేసేందుకు ప్రయత్నించారు. కచ్చితమైన వివరాలు తెలుసుకున్న సీసీబీ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేశారని ఎంఎన్ రెడ్డి తెలిపారు.
స్వాధీనం చేసుకున్న నకిలి నోట్లు పాకిస్థాన్ లో ముద్రించారన్నారు. పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ మీదుగా ఈ నకిలి నోట్లు భారత్ లోకి తీసుకు వచ్చినట్లు నిందితులు విచారణలో అంగీకరించారని ఎంఎన్ రెడ్డి చెప్పారు. రూ.2 లక్షలు అసలైన నోట్లు ఇస్తే రూ.నాలుగు లక్షల నకిలీ నోట్లు వీరు ఇస్తున్నారని వివరించారు. ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయమై ఆరా తీస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బెంగళూరు నగర జాయింట్ పోలీసు కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications