Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు..
జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్యం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆపరేషన్ చివరి దశలో ఉందని హతమైన ఉగ్రవాది ఎవరనేది నిర్ధారిస్తున్నామని పోలీసులు తెలిపారు. "గ్రామంలోని కొన్ని నివాస గృహాలలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాక్కున్న ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఈ ఎన్కౌంటర్లో నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను షోపియాకు చెందిన సమీర్ అహ్మద్ షేక్, షోపియాకు చెందిన డానిష్ థోకర్, షోపియాకు చెందిన ఉబైద్ పాత్ర, షోపియాకు చెందిన హంజారా షా, కుల్గామ్కు చెందిన యాసిఫ్ భట్లుగా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది" అని అధికారులు తెలిపారు.
మొత్తం మీద 18 గంటల పాటు ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. ఈ ఆపరేషన్లో నాలుగు ఎకె సిరీస్ రైఫిళ్లు, రెండు పిస్టల్స్, నాలుగు గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. "ఈ ప్రాంతంలో పనిచేసే అన్ని భద్రతా బలగాల సమన్వయంతో కూడిన కృషి తర్వాత ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఉగ్రవాదులు మైనారిటీలపై అనేక దాడులకు పాల్పడినందున ఇది పెద్ద విజయం" అని పేర్కొన్నారు.

సరిహద్దు వెంబడి భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు రెండు క్రితం ధృవీకరించిన విషయం తెలిసిందే.కుల్గామ్లోని నేహమా ప్రాంతంలోని సామ్నో వద్ద రాత్రిపూట ప్రశాంతంగా ఉన్న తర్వాత శుక్రవారం తెల్లవారుజామున తుపాకీ కాల్పులు జరిగినట్లు అధికారులు వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు దాక్కున్న ఇంట్లో మంటలు చెలరేగడంతో ఉగ్రవాదులు బయటకు వచ్చేశారు.
సెప్టెంబరు 13న అనంత్నాగ్లోని గారోల్ అడవుల్లో జరిగిన ఆపరేషన్లో వారం రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో నలుగురు భద్రతా దళాల సిబ్బంది, ఇద్దరు టెర్రరిస్టులు హతటమయ్యారు. అంతకుముందు, నవంబర్ 15, బుధవారం ఉరీ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు బిడ్ను అడ్డుకున్నట్లు సైన్యం తెలిపింది. 'ఆపరేషన్ కలి' పేరుతో జాయింట్ ఆపరేషన్లో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు చొరబాటుదారులను మట్టుబెట్టారు. హతమైన ఇద్దరు చొరబాటుదారులలో బషీర్ అహ్మద్ మాలిక్ అని ఆర్మీ తెలిపింది.
-
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications