స్మృతి సాహసం: సైనికులతో రాఖీ పండుగ, సియాచిన్లో గాలి ఆడక...
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు స్మృతి ఇరానీ గురువారం నాడు సియాచిన్ బేస్ క్యాంపులో సైనికులతో రాఖీ పర్వదినం జరుపుకున్నారు. సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం.
స్మృతి ఇరానీ గురువారం ఉదయం శ్రీనగర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సియాచిన్ చేరుకున్నారు. తొలుత కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులకు బేస్ క్యాంప్ వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత జవాన్లకు రాఖీలు కట్టారు.

ఇదిలా ఉండగా, సియాచిన్ ఎత్తయిన పర్వతం కావడంతో ఆమెకు ఆక్సిజన్ అందలేదు. దీంతో హెలికాప్టర్లో ఆర్మీ అధికారులు ఆమెకు ఆక్సిజన్ అందించారు. తొలిసారి ఓ మహిళా కేంద్రమంత్రి సియాచిన్ రావడం, జవాన్లతో రాఖీ పండుగ జరుపుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు. స్మృతీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications