ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడి కొడుకుపై నడిరోడ్డులో హత్యాయత్నం, అదే కారణం !
శ్యాండిల్ వుడ్ ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు జగ్గేష్ కుమారుడు గురురాజ్ మీద సోమవారం ఉదయం హత్యాయత్నం జరిగింది.
బెంగళూరు: శ్యాండిల్ వుడ్ ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు జగ్గేష్ కుమారుడు గురురాజ్ మీద సోమవారం ఉదయం హత్యాయత్నం జరిగింది. నడి రోడ్డులో గురురాజ్ మీద కత్తితో దాడి చేసిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారని బెంగుళూరులోని ఆర్ టీ నగర్ పోలీసులు చెప్పారు.
హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టైల్ లో సూపర్ స్టార్, ఖాకీ చొక్కా?
సోమవారం ఉాదయం గురురాజ్ తన కుమారుడిని స్కూల్ లో వదిలిపెట్టడానికి బెంగళూరులోని ఆర్ టీ నగర్ లోకి వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గురురాజ్ తో గొడవపెట్టుకున్నారని సమాచారం. ఆ సందర్బంలో నిందితులు కత్తి తీసుకుని గురురాజ్ ఎడమ కాలి తొడ మీద దాడి చేసి పరారైనారు.
వెంటనే ఆర్ టీ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురురాజ్ ను చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రముఖ నటుడు జగ్గేష్ ఆర్ టీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత కారణాల వలన గురురాజ్ మీద హత్యాయత్నం జరగలేదని, ట్రాఫిక్ విషయంలో గొడవ పడిన సందర్బంలో నిందితులు కత్తితో దాడి చేసి పారిపోయారని జగ్గేష్ ఫిర్యాదు చేశారని, నిందితుల కోసం గాలిస్తున్నామని ఆర్ టీ నగర్ పోలీసులు తెలిపారు.