కర్ణాటక నుంచి పెద్దల సభలో అడుగుపెడుతున్న సోనియా గాంధీ, సిద్దూ స్కెచ్ తో షాక్ !
బెంగళూరు: కర్ణాటకలో నాలుగు స్థానాలకు జరిగే రాజ్యసభ ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు సయ్యద్ నసీర్ హుస్సేన్, సుప్రియా శ్రీనాథ్ లను రాజ్యసభకు పంపించాలని ఊహాగానాలు మొదలైనాయి. సోనియా గాంధీని రాజ్యసభకు పంపించి మేడమ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని సిద్దరామయ్య బ్యాచ్ ప్రయత్నిస్తున్నదని తెలిసింది.
నలుగురు ఎంపీలు చంద్రశేఖర్, సయ్యద్ నసీర్ హుస్సేన్, డాక్టర్ ఎల్ హనుమంతయ్య, రాజీవ్ చంద్రశేఖర్ పదవీకాలం 2024 ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తుంది. ప్రస్తుత బలం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగింటికి మూడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ సమన్వయకర్త నాసీర్కు మరోసారి రాజ్యసభ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దం అయ్యింది.

కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లే విఫయంలో సోనియాగాంధీ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఆమె ఎగువసభలో అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిసింది. ప్రధానంగా సోనియా గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదనను అంగీకరిస్తే అది రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా 1989 నుండి నివసిస్తున్న 10 జన్పథ్ ఇంటిని కొనసాగించడానికి అవకాశం ఉందని తెలిసింది.

1997లో భద్రతా కారణాల దృష్ట్యా ఆమెకు ఇవ్వబడింది. సోనియా గాంధీ ప్రస్తుతం ఐదుసార్లు లోక్సభ ఎంపీగా ఉన్నారు. అమేథీ నుంచి ఒకసారి, రాయ్బరేలీ నుంచి నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించారు. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోని అసాధారణ రికార్డు సోనియా గాంధీ సొంతం అయ్యింది. అయితే అనారోగ్యం, ఇతర కారణాల వల్ల 2019లో సోనియా గాంధీ ఎన్నికల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు.కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హవా ఉండటంతో ఇప్పుడు సోనియా గాంధీ ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని తెలిసింది.












Click it and Unblock the Notifications