ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారా?: 'ప్రీపోల్ సర్వే' క్రెడిట్ ఆమెకేనా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా కోరుకున్న కల ఫలించింది. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెను యూపీ ఈస్ట్ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది.

రాయ్బరేలి నుంచి పోటీ చేస్తారా?
ప్రియాంక గాంధీ తన కోసం రాయ్బరేలీలో ప్రచారం చేయడంతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా మమేకమైన సందర్భాలు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా సోనియా ఆరోగ్యం సహకరించడం ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రాయ్బరేలీలో నుంచి ప్రియాంక గాంధీ నుంచి బరిలోకి దింపుతారా అనే చర్చ సాగుతోంది. మరోవైపు, రాహుల్ గాంధీ కూడా మధ్యప్రదేశ్ వెళ్తారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సీట్ల మార్పిడి ఏమైనా చోటు చేసుకుంటుందా అనే చర్చ సాగుతోంది.

అదే సమయంలో కీలక బాధ్యతలు
2014 నుంచి సోనియా గాంధీ రాయ్బరేలీకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఆరోగ్య సమస్యల కారణంగా రాలేదు. తాజాగా, రెండు రోజులు తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇదే సమయంలో ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

యూపీ క్రెడిట్ ప్రియాంక గాంధీ ఖాతాలో పడుతుందా?
2014 ఎన్నికల్లో యూపీలో బీజేపీకి 80 సీట్లకు గాను 70కి పైగా వచ్చాయి. ఇటీవల పలు ప్రీ పోల్ సర్వేల్లో నలభై సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. బీఎస్పీ, అఖిలేష్ పార్టీలు కలిసినందువల్ల అంతకంటే తక్కువ సీట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి 30 నుంచి 50 సీట్లు మాత్రమే వస్తాయని భావిస్తున్నారు. ఇవే ఫలితాలు వచ్చే ఎన్నికల్లో వస్తే అది ప్రియాంక గాంధీ క్రెడిట్లోకి వెళ్తుందని, కాంగ్రెస్ దానిని విస్తృతంగా ప్రచారం చేసుకుంటందని అంటున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications