రాజీనామా చేయండి.. 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్లకు సోనియా గాంధీ ఆదేశం
5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. 4 రాష్ట్రాల్లో తిరిగి కమలమే వికసించింది. ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో.. రాజీనామాస్త్రాన్ని సోనియా ప్రయోగించారు. కానీ సభ్యులు తిరస్కరించడంతో.. సోనియానే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్ల గురించి సోనియా ఫోకస్ చేశారు.
పార్టీని పటిష్ఠపరిచే పనికి కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఓటమిపై పోస్టుమార్టం పేరుతో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తాజాగా మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ముగిసిన 5 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్కు చెందిన పార్టీ శాఖల చీఫ్లు తక్షణమే తమ పదవులకు రాజీనామాలు చేయాలని సోనియా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన 5 రాష్ట్రాల రాష్ట్ర శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉన్నందున పీసీసీ పదవులకు రాజీనామాలు చేయాలని ఆదేశించారు.

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధు ఇప్పటికే రాజీనామా చేశారు. కాంగ్రెస్లో మార్పుల కోసం ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల్లో నాయకత్వ మార్పు కోసం కొందరు సీనియర్లు పట్టుబడుతున్న తరుణంలో సోనియా నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. మిగిలిన నేతలు కూడా రాజీనామా చేయాల్సి వస్తోంది. మరోవైపు గాంధీలపై వ్యతిరేక గళం వినిపిస్తోంది. ఇవాళ రాహుల్ గాంధీ గురించి కపిల్ సిబాల్ కామెంట్ చేశారు. ఆయన అధ్యక్షుడు కారు.. కానీ అన్నీ నిర్ణయాలు తీసుకుంటారు అని మాట్లాడారు.
గాంధీ నాయకత్వంపై కొందరు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అందుకోసమే వారు రాజీనామాస్త్రం ప్రకటించారు. కానీ కొందరు మాత్రం వీడాల్సిందేనని అంటున్నారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్లకు సంబంధించి సోనియా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని సంస్థాగతంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications