సోనియాలాగా రాహుల్ కూడా రోజూ ఆఫీస్కు రావాలి: షీలా దీక్షిత్, మరి రాహుల్ ఏమంటారో?
రాహుల్గాంధీ కూడా తన తల్లి సోనియాగాంధీ మాదిరిగానే ప్రతి రోజూ ఉదయం పార్టీ ప్రధాన కార్యాలయానికి రావాలని పార్టీ సీనియర్ నేత షీలాదీక్షిత్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకాంక్ష వెలిబుచ్చారు.
న్యూఢిల్లీ: రాహుల్గాంధీ కూడా తన తల్లి సోనియాగాంధీ మాదిరిగానే ప్రతి రోజూ ఉదయం పార్టీ ప్రధాన కార్యాలయానికి రావాలని పార్టీ సీనియర్ నేత షీలాదీక్షిత్ ఆకాంక్ష వెలిబుచ్చారు.
సోనియా గాంధీ రోజూ కార్యాలయంలో రెండు నుంచి మూడు గంటల పాటు ఉండేవారని రాహుల్ కూడా అలాగే కార్యాలయానికి వచ్చి పార్టీ కార్యకలాపాల విషయంలో మరింత శ్రద్ధ వహించాలని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్థానంలోకి ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రానున్నారనే వూహాగానాల నేపథ్యంలో షీలా దీక్షిత్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్టీ కార్యకర్తలు, నేతలతో రాహుల్ మరింత మమేకం కావాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. సోనియాగాంధీ పార్టీ అధ్యక్షురాలు అయిన సమయంలో అలాగే చేశారని, రాహుల్ కూడా అదే అనుసరించాలని.. అప్పుడు తప్పకుండా తిరిగి కాంగ్రెస్ కార్యాలయంలో సందడి నెలకొంటుందని షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు.
రాహుల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తిరిగి మంచి రోజులు వస్తాయని, మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. షీలా దీక్షిత్ ఆకాంక్ష అయితే బాగానే ఉంది కానీ, మరి రాహుల్ ఏమంటారో?