వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దినకరన్ కు ఫస్ట్ వార్నింగ్: ఐటీ దాడులు సాంపిల్ మాత్రమే, సీఎం కావాలంటే !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్న టీటీవీ దినకరన్ కు ఝలక్ ఇవ్వడానికే శుక్రవారం ఆ రాష్ట్రంలో ఐటీ దాడులు జరిగాయని సమాచారం. దినకరన్ హద్దు మీరి ఎగిరిపడటంతోనే ఆయన్ను అదుపులో పెట్టడానికి ఐటీ దాడులు జరిగాయని తెలిసింది.

విశ్వసనీయ సమాచారం మేరకు దినకరన్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడం కేంద్రంలోని పెద్దలకు ఇష్టం లేదని తెలిసింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచి ఎడప్పాడి పళనిసామిని తప్పించి తమిళనాడు సీఎం కావాలని దినకరన్ ప్లాన్ వేశారని సమాచారం.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన తరువాత తనను సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని దినకరన్ ధీమాగా ఉన్నారని తెలిసింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి.

Sources said that Centre not accept TTV Dinakaran to become as Chief Minister of Tamil Nadu.

ఇప్పటికే దినకరన్ అనుచరులను పోలీసులు అరెస్టు చేసి భారీ మొత్తంలో నగదు సీజ్ చేశారు. అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున పోటీ చేస్తున్న దినకరన్ తన అనుచరులతో భారీ మొత్తంలో ఆర్ కే నగర్ ఓటర్లకు నగదు పంచిపెడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఈ సందర్బంలో దినకరన్ కు ఝలక్ ఇవ్వడానికే ఆయనకు అత్యంత సన్నిహితుడైన తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారని సమాచారం.

English summary
Sources said that Centre not accept TTV Dinakaran to become as Chief Minister of Tamil Nadu. Today IT Raids also first warning to TTV Dinakaran who wants to become CM of Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X