ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమం: ఆస్పత్రిలో చేరిక
లక్నో: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో వెంటనే ఆయనను ఆదివారం గుర్గావ్లోని మెదాంత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)కి తరలించారు.
82 ఏళ్ల ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ సీఎంను ఆదివారం ఉదయం ఐసీయూకి తరలించారు. చికిత్స ఇంకా కొనసాగుతోంది.

ములాయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారని, అతని వైద్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇంటర్నల్ మెడిసిన్లో నిపుణుడైన డాక్టర్ సుశీలా కటారియా ప్రస్తుతం అతనిని పర్యవేక్షిస్తున్నారని ఇండియా టుడే పేర్కొంది.
ములాయం అనేక రకాల వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, వాటిలో అత్యంత తీవ్రమైనది మూత్రనాళ ఇన్ఫెక్షన్ అని వైద్యులు తెలిపారు. ఈ వార్తల నేపథ్యంలో, సమాజ్వాదీ పార్టీ అధినేత, ములాయం పెద్ద కుమారుడు అఖిలేష్ యాదవ్ ఆస్పత్రికి బయల్దేరి వెళ్లినట్లు తెలిసింది.
కాగా, ములాయం వరుసగా మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. భారత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ప్రస్తుతం మెయిన్పురి లోక్సభ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. నేతాజీ అని పిలవబడే ములాయం యాదవ్.. 1967లో ఉత్తరప్రదేశ్ శాసనసభలో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications