మెమెన్ భార్యకు రాజ్యసభ సీటు? (వీడియో)
ముంబై: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్లు సృష్టించి ఉరి శిక్షకు గురైన యాకూబ్ మెమెన్ కుటుంబ సభ్యులను రాజకీయంగా పైకి తీసుకు వచ్చి ఒక వర్గంలో సానూభూతి సంపాదించాలని సమాజ్ వాదీ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
యాకూబ్ మెమెన్ భార్యను రాజ్యసభకు పంపించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. యాకూబ్ మెమెన్ కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే యాకూబ్ మెమెన్ భార్య రహీనా మెమెన్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తామని మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ నేతలు అంటున్నారు.

సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు ఫరూఖ్ ఘోషి ఇప్పటికే ఎస్ పీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ కు ఈ విషయంపై లేఖ వ్రాశారు. ములాయం సింగ్ యాదవ్ సమాధానం కోసం మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నారు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమెన్ అరెస్టు అయ్యాడు.
థ్రిల్లర్ సినిమా ను తలతన్నే విధంగా అనేక ట్విస్ట్ లతో చివరికి జులై 30వ తేదిన ఉదయం 6.40 గంటలకు నాగ్ పూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ మెమెన్ ను ఉరి తీశారు. మగ దిక్కును కొల్పోయిన యాకూబ్ మెమెన్ భార్యను రాజకీయంగా పైకి తీసుకు వచ్చి మహారాష్ట్రలో తమ సత్తా చాటుకోవాలని ఆ రాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమెన్ భార్య రహీనా మెమెన్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications