స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం..: విపక్షాల స్కెచ్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా, ఉత్కంఠగా మారాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, రూలింగ్ ఇవ్వడం, మాజీ సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవణే రచించిన పుస్తకం నుండి కొన్ని భాగాలను సభలో చదవడానికి ప్రయత్నించినప్పుడు ఆయనను అడ్డుకోవడం దీనికి కారణమైంది.
పబ్లిష్ కాని పుస్తకంలో పొందుపరిచిన అంశాలను లోక్ సభలో చదివి వినిపించడం సభా నియమాలకు విరుద్ధమని అప్పట్లో స్పీకర్ వెల్లడించారు. ప్రసంగాన్ని కొనసాగించడానికి రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించారు. ప్రచురితం కాని పుస్తకంపై చర్చ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తన వాదనపై గట్టిగా నిలబడడంతో లోక్సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. దీంతో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడలేకపోయారు.

ఈ సంఘటనకు ముందే, రాహుల్ గాంధీ.. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. సభలో మాట్లాడకుండా అడ్డుకోవడం పార్లమెంటరీ సంప్రదాయాల ఉల్లంఘనే అని అందులో పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా జాతీయ భద్రత అంశాన్ని లేవనెత్తే తన హక్కును నిరాకరించారని కాంగ్రెస్ ఆ లేఖలో స్పష్టంగా తెలిపింది. తాను పేర్కొన్న మ్యాగజైన్ను ధృవీకరించానని వివరించారు.
పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం, సభలో పత్రాన్ని ప్రస్తావించే సభ్యుడు దానిని ధృవీకరించి, కంటెంట్కు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. దీనికి భిన్నంగా స్పీకర్ వ్యవహరించినట్లు కాంగ్రెస్ భావిస్తోంది. అధికార పక్షానికి వత్తాసు పలికిందని మండిపడుతోది. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా, నిబంధనలను ఉదహరిస్తూ తమ ప్రసంగాన్ని పూర్తి చేయనివ్వలేదని ఆరోపిస్తుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో - లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి కనీసం 100 మంది లోక్సభ సభ్యుల సంతకాలతో కూడిన దరఖాస్తు అవసరం. ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు ఉన్నారు. లోక్సభలో దీనిని ఆమోదింపజేసే మెజారిటీ కాంగ్రెస్ కు లేదు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications