చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజ జీవిత గాథ: అన్నం కోసం ఓ శరణార్ధి ఆత్మహత్య

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని మధురైలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ శ్రీలంక శరణార్థి విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి విద్యుత్ వైర్లను తాకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రవీంద్రన్ (48) అనే వ్యక్తి ఓ శరణార్థి. శ్రీలంక నుంచి వచ్చి మధురైలో శరణార్థుల నివాసంలో ఉంటున్నాడు.

అతడి కుమారుడికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నాడు. ఇదే సమయంలో శరణార్థులకు ఆహారం ఏర్పాట్లు చూసేందుకు ఓ రెవెన్యూ అధికారి వచ్చాడు. తన కుమారుడి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేర్పించామని, అతడికి గైర్హాజరు వేయొద్దని కోరాడు.

మీరు గైర్హాజరు వేస్తే, తన కుమారుడికి భోజనం దొరకదని ఆ అధికారి వద్ద మొరపెట్టుకున్నాడు. అంతేకాదు తన కుమారుడు ఆసుపత్రిలో ఉన్నాడనే విషయాన్ని రుజువు చేసేందుకు రశీదుని కూడా చూపించాడు. అయితే రవీందర్ కోరికను మన్నించని ఆ ఆధికారి గైర్హాజరైనట్లుగా మార్క్ చేశాడు.

Sri Lankan refugee commits suicide in Madurai camp

ఈ క్రమంలో రవీందర్ మరోసారి బ్రతిమలాడగా కనికరించిన ఆ అధికారి కరెంటు స్తంభం ఎక్కి దూకి చావు అన్నాడట. ఆ మాట అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రవీందర్ సమీపంలో ఉన్న హై టెన్షన్ విద్యుత్ వైర్ల స్థంభాన్ని ఎక్కి ఆ వైర్లు పట్టుకొని సెకన్లలో చనిపోయాడు.

ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడికి పెద్దఎత్తున స్థానికులు చేరుకున్నారు. అయితే స్థానిక అధికారి వేధింపుల వల్లే రవీందర్ చనిపోయాడంటూ మిగతా శరణార్థులు ఆందోళనకు దిగారు. అంతేకాదు ఆ అధికారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఆ అధికారికి రక్షణ కల్పించారు.

అనంతరం దాడిలో తీవ్రంగా గాయపడ్డ అధికారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై మధురై ఎస్పీ విచారణ చేపట్టారు.

English summary
A Sri Lankan refugee at a camp in Uchapatti in Madurai allegedly committed suicide on Sunday after his request to not mark his hospitalised son as "absent" during an inspection were turned down by an official.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X