సైబర్ ఫ్రాడ్: ఎస్బీఎం ముంబై బ్రాంచిలో రూ. 143కోట్లు మాయం, ఇదే మొదటిసారి కాదు!
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని స్టేట్ బ్యాంక్ మారిషస్(ఎస్బీఎం) బ్యాంక్లో సైబర్ దాడి జరిగింది. అయితే విషయం ఆల్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకులోని పలు ఖాతాల నుంచి దాదాపు రూ.143కోట్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు.
ముంబైలోని నారిమన్ పాయింట్ బ్రాంచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై బ్యాంకు అధికారులు అక్టోబర్ 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. హ్యాకర్లు బ్యాంక్ సర్వర్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకున్నారు.

వారి ఖాతాల నుంచి సుమారు రూ.143కోట్లను ఇతర దేశాల్లోని పలు ఖాతాలకు మళ్లించినట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. గత తొమ్మిది నెలల కాలంలో బ్యాంకులపై జరిగిన మూడో సైబర్ దాడి కావడం గమనార్హం.
ఫిబ్రవరిలో చెన్నైలోని సిటీ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్పై దుండగులు సైబర్దాడికి పాల్పడి రూ.34కోట్లను మళ్లించారు. ఆగస్టు నెలలో పుణెలోని కాస్మోస్ బ్యాంక్లోనూ ఇలాగే రూ.94కోట్లను దారి మళ్లించారు. ఎస్బీఎం బ్యాంక్పై సైబర్ దాడిలో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలోను పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications