రాహుల్ గాంధీ ఇండియన్ కాదు!: స్వామి సంచలనం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత సుబ్రహ్మణ్య స్వామి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ భారతీయుడు కాదని విమర్శించారు. ఆయన ఇండియన్ సిటిజన్షిప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాహుల్ గాంధీ ఇండియన్ సిటిజన్ షిప్ రద్దు చేయాలని ప్రధాని మోడీతో పాటు లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు లేఖ రాశారు. రాహుల్ గాంధీ ఎంపీ పదవికి అనర్హుడు అన్నారు.

రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉన్న పత్రాలను తాను సంపాదించినట్లు చెప్పారు. తనకు బ్రిటిష్ పౌరసత్వం (2003 నుంచి 2009) ఉందని రాహుల్ గాంధీ చెప్పాడని, ఆయన భారత్ పౌరసత్వం రద్దు చేయాలన్నారు.
సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణల పైన కాంగ్రెస్ స్పందించింది. స్వామి సిల్లీ స్టేట్మెంట్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అతని వ్యాఖ్యలను ఎవరీ సీరియస్గా తీసుకోరాని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ అన్నారు.












Click it and Unblock the Notifications